Congratulations!

[Valid RSS] This is a valid RSS feed.

Recommendations

This feed is valid, but interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.

Source: https://kadalitaraga.wordpress.com/feed/

  1. <?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
  2. xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
  3. xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
  4. xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
  5. xmlns:atom="http://www.w3.org/2005/Atom"
  6. xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
  7. xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
  8. xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
  9. >
  10.  
  11. <channel>
  12. <title>Kadali Taraga : A Wave in the Ocean !</title>
  13. <atom:link href="https://kadalitaraga.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
  14. <link>https://kadalitaraga.wordpress.com</link>
  15. <description>I may disapprove of what you say, but I will defend to the death your right to say it - Voltaire</description>
  16. <lastBuildDate>Wed, 04 Aug 2021 02:21:01 +0000</lastBuildDate>
  17. <language>en</language>
  18. <sy:updatePeriod>
  19. hourly </sy:updatePeriod>
  20. <sy:updateFrequency>
  21. 1 </sy:updateFrequency>
  22. <generator>http://wordpress.com/</generator>
  23. <cloud domain='kadalitaraga.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
  24. <image>
  25. <url>https://secure.gravatar.com/blavatar/2e9646f106833b3ab4b38616665ee71cf3d933ef75ac9f18353d7f8d332bc96b?s=96&#038;d=https%3A%2F%2Fs0.wp.com%2Fi%2Fbuttonw-com.png</url>
  26. <title>Kadali Taraga : A Wave in the Ocean !</title>
  27. <link>https://kadalitaraga.wordpress.com</link>
  28. </image>
  29. <atom:link rel="search" type="application/opensearchdescription+xml" href="https://kadalitaraga.wordpress.com/osd.xml" title="Kadali Taraga : A Wave in the Ocean !" />
  30. <atom:link rel='hub' href='https://kadalitaraga.wordpress.com/?pushpress=hub'/>
  31. <item>
  32. <title>అసలు నీటి కోసమేనా ఈ వివాదాలు?</title>
  33. <link>https://kadalitaraga.wordpress.com/2021/08/04/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%ae%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6/</link>
  34. <comments>https://kadalitaraga.wordpress.com/2021/08/04/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%ae%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6/#respond</comments>
  35. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  36. <pubDate>Wed, 04 Aug 2021 02:21:01 +0000</pubDate>
  37. <category><![CDATA[Telugu]]></category>
  38. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=856</guid>
  39.  
  40. <description><![CDATA[నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం &#8211; తెలంగాణార్థం కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2021/08/04/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%ae%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  41. <content:encoded><![CDATA[
  42. <p>నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం &#8211; తెలంగాణార్థం</p>
  43.  
  44.  
  45.  
  46. <p></p>
  47.  
  48.  
  49.  
  50. <p>కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి వారంలో అధికారిక అనుమతులు ఇవ్వడంతో అంతకు ముందరి చిటపటలు మంటలుగా రగుల్కొన్నాయి. నీరు నిప్పై మండడం ప్రారంభమైంది. దానికి ప్రతిగా తెలంగాణ కాబినెట్ జూన్ లో కృష్ణా నదీ జలాల వినియోగానికి ఆరు పథకాలను ఆమోదించింది. జూలైలో కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుదుత్పాదన చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది.</p>
  51.  
  52.  
  53.  
  54. <p>ఇలా ఈ ఘర్షణ పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రాజెక్టుల యాజమాన్య పరిధి, ఆలంపూర్ బారేజి, వరదకాలువ, నాగార్జునసాగర్ టేల్ పాండ్ ఎత్తిపోతల పథకం వంటి ప్రతిపాదనలు, కృష్ణా మిగులు జలాలు, నికరజలాలు, పాత పంపిణీలలో అసమానతలు, కొత్త పంపిణీ జరగవలసిన అవసరం వంటి అనేక సంబంధిత అంశాల చుట్టూ తిరుగుతూ చినికి చినికి గాలివాన అయింది. ఇంతలోనే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం (నిజానికి దాన్ని కేంద్ర ప్రభుత్వం అనడం తప్పనీ, సమాఖ్య ప్రభుత్వం అనాలనీ అంటున్న తమిళ సోదరుల నుంచి మనమింకా నేర్చుకోవలసే ఉంది) అన్ని హక్కులనూ కృష్ణా, గోదావరీ జలాల బోర్డులకు అప్పగిస్తూ దుర్మార్గమైన గెజెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఆ ఢిల్లీ సర్కారు దుర్మార్గం అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండగానే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ మీదికి వస్తున్న ఉత్పాతాన్ని పట్టించుకోనట్టు తమలో తాము కీచులాడుకుంటున్నాయి. దాదాగిరీ అనీ, దౌర్జన్యం అనీ, మోసం అనీ, కొల్లగొట్టడం అనీ ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకుంటున్నారు.</p>
  55.  
  56.  
  57.  
  58. <p>రెండువైపులా సామరస్యంగా ఆలోచించలేని, ఉద్రేకాలు పెరిగిన ఈ నేపథ్యంలో చరిత్ర తవ్వి ఎవరి తప్పు ఎంత నిర్ధారించడం అసాధ్యమవుతుంది. కాని గుర్తించవలసిన విషయమేమంటే రెండు వైపులా పాలకుల దృష్టి నీటి మీద మాత్రమే లేదు. రెండు వైపులా నీరు ఒక సాకు మాత్రమే. రెండు ప్రాంతాల పాలకులూ నీటిని సెంటిమెంటుగా వాడుకుంటున్నారు. ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టే దినుసుగా మాత్రమే చూస్తున్నారు. జలవివాదాన్ని వోటు బ్యాంక్ ను బలోపేతం చేసుకునే, స్థిరపరచుకునే సాధనంగా చూస్తున్నారు. న్యాయాన్యాయాల జోలికి, చట్టబద్ధత చట్టవ్యతిరేకత జోలికి పోకుండా ఎవరు ఎంత ఎక్కువ బిగ్గరగా అరిస్తే, ఎవరు అవతలివాళ్ల మీద ఎంత ఎక్కువ అభాండాలు వేస్తే అంత ఎక్కువగా తమ ప్రాంతంలోని ప్రజలను ఆకర్షించగలమని అనుకుంటున్నారు.</p>
  59.  
  60.  
  61.  
  62. <p>ఇటువంటి వాతావరణంలో చరిత్ర, వాస్తవాలు, న్యాయభావన, ప్రజాప్రయోజనాలు వంటివన్నీ గాలికి, కాదు నీళ్లలో, కొట్టుకు పోతున్నాయి. అంతకన్న ముఖ్యంగా ఏ స్థానిక, ప్రాంతీయ హక్కు కోసం ఇరు పక్షాలూ ఇంత ఘర్షణకు దిగుతున్నాయో, ఆ స్థానికత, ప్రాంతీయత ధ్వంసమై, మొత్తంగా ఎటువంటి హక్కూ అధికారమూ లేని సమాఖ్య ప్రభుత్వ జోక్యం పెరుగుతున్నది. ఇప్పుడిది సుప్రీంకోర్టుకు కూడ చేరి, అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య హింసాయుతంగా మారిన ఘర్షణ ప్రస్తావన కూడ వచ్చింది. అంటే మొత్తం మీద నదీ జలాల పంపిణీ సమస్యను తమ మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవలసిన రెండు పరీవాహక రాష్ట్రాల పాలకులు తమ రాజకీయ, తాత్కాలిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అనవసరమైన వివాదానికి కాలు దువ్వుతున్నారు.</p>
  63.  
  64.  
  65.  
  66. <p>ఎక్కువగా సాంకేతిక అంశాలలోకి పోకుండానే, ఈ వివాదానికి మూలాలు చరిత్రలోనే ఉన్నాయని గుర్తించవలసి ఉంది. పశ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణా నది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు దాటి తెలంగాణలో ప్రవేశిస్తుంది. పద్నాలుగు వందల కి.మీ. పొడవైన ఈ నదిలో సాలీనా 2,060 టిఎంసిల నీరు (75 శాతం లభ్యతతో) ఉంటుందని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (బచావత్ ట్రైబ్యునల్) అంచనావేసింది. ఆ ట్రైబ్యునల్ అవార్డ్ ప్రకారం అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టిఎంసిలు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానది తెలంగాణలో 68.5 శాతం ప్రవహిస్తుండగా, నీటి వాడకం మాత్రం 19.7 శాతం ఉండేలా ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం జరిగాయి. కృష్ణా జలాల మీద న్యాయంగా హక్కు ఉండే పరీవాహక ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరవలసినంతగా నెరవేరలేదు. కృష్ణానదీ జలాల వినియోగదారులలో దిగువన ఉన్న రెండు మూడు జిల్లాల రెండు పంటల, మూడు పంటల ప్రయోజనం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎగువ జిల్లాల ప్రజల పొలాలూ గొంతులూ ఎండబెట్టాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన అసంతృప్తులలో అది ఒకటి.</p>
  67.  
  68.  
  69.  
  70. <p>అలా ఉమ్మడి రాష్ట్రానికి దక్కిన వాటాను న్యాయబద్ధంగా పంపిణీ చేయకపోవడం ఒక అంశమైతే, అసలు కొన్ని సంవత్సరాలు వందల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తుండగా, కొన్ని సంవత్సరాలు వాటాకు తగిన నీరు కూడ రాని పరిస్థితి ఉండేది. నిజానికి కృష్ణా జలాల లభ్యత 2,060 టిఎంసిలు అనేది సరైన అంచనా కాదని, అంత నీరు లభ్యమయ్యే సంవత్సరాలు అతి తక్కువ అని, ఆ మొత్తం లభ్యతను వాస్తవికంగా, అంటే తక్కువగా నిర్ధారించి ఆమేరకే వాటాలు కేటాయించవలసి ఉండిందని రాసిన జల నిపుణులు కూడ ఉన్నారు. ఈ నికర జలాలు కాక, ఉంటాయో ఉండవో తెలియని మిగులు జలాల మీద హక్కు ఎవరిదనే వివాదం ఉండనే ఉంది.</p>
  71.  
  72.  
  73.  
  74. <p>బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపిణీని పునఃపరిశీలించవలసి ఉందనే ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలో మిళితమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ జల వివాదాల పరిష్కార బాధ్యతను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న బోర్డులకు అప్పగించింది. అప్పటికి ఐదు సంవత్సరాల కింద ఏర్పడిన బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్చలు, సంప్రదింపులు జరపవలసి ఉందని, ఈ లోగా తాత్కాలిక కేటాయింపుగా 2015లో అప్పటికి ఉన్న 811 టిఎంసిల నీటినే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 66:34 నిష్పత్తితో పంపిణీ చేసింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు దక్కాయి. ఈ అసమాన పంపిణీలోనే అన్యాయం ఉంది. నిజానికి అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో తమ నీటి వాటా తమకు దక్కలేదని, అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యమ నాయకులు పాలకులు కాగానే ఈ అసమాన పంపిణీని పేరుకు సుప్రీం కోర్టులో సవాలు చేసినప్పటికీ, వాస్తవంగా అంగీకరించారు. ఒకరకంగా అప్పటివరకూ జరిగిన అన్యాయాలను స్థిరీకరించారు. బహుశా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం ఉండే ఈ అసమానతను యథాతథంగా ఉంచడమే భవిష్యత్తులో తమకు ఉపయోగపడుతుందని అనుకున్నారేమో తెలియదు. నిజానికి ప్రస్తుత వివాదంలోని దాదాపు అన్ని అంశాలకూ మూలాలు 2014 ముందరి చరిత్రలో ఉండగా, ఆ అంశాలను 2015 అసమాన పంపిణీ స్థిరీకరించింది.</p>
  75.  
  76.  
  77.  
  78. <p>ఈ స్థితిలో ప్రధానంగా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయాలని, కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు పనితీరు సమన్వయపూరితంగా, ప్రజాస్వామికంగా, పారదర్శకంగా ఉండాలని వాదించవలసిన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయలేదు. బేసిన్ లో ఉన్నదా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ సాగునీటి, తాగునీటి అవసరాల కోసం, కృష్ణా, గుంటూరు ప్రయోజనాలు తగ్గించి అయినా కృష్ణా జలాలు అందించవలసి ఉంటుందని, అందుకు ఎగువ రాష్ట్రాల నుంచి రాదగిన అభ్యంతరాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోలేదు.</p>
  79.  
  80.  
  81.  
  82. <p>ఇటు తెలంగాణ ప్రభుత్వం నీటిని ఇంకా ఇంకా ఎక్కువగా సెంటిమెంటుగా మార్చడమెట్లా, నీరు కోరే ప్రజలకు ఎండమావులు చూపుతూ తన వెనుక ఉంచుకోవడమెట్లా, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షకురాలిని తాను మాత్రమేననిపించే రాజకీయ క్రీడలో పావులు కదపడం ఎట్లా, సమస్య వచ్చినప్పుడల్లా తెలంగాణ తెలంగాణ అని ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే వీలు ఉంచుకోవడం ఎట్లా అని మాత్రమే ఆలోచిస్తూ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయార్థిక విధానాలనూ, రాయలసీమ పట్ల వివక్షనూ అట్లాగే కొనసాగిస్తూ, మాటల్లో మాత్రం రాయలసీమకు ఏదో ఒరగబెడుతున్నట్టు నటించే కళను యథాతథంగా కొనసాగించారు. అంతకు ముందరి ఉమ్మడి ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ కేంద్ర జల సంఘం, నదీజల బోర్డులు, పర్యావరణ సంస్థలు ఇవ్వవలసిన అనుమతులు, ఆర్థిక అనుమతులు లేకుండానే ప్రజలను మాయ చేయడానికి ప్రాజెక్టులు ప్రకటించడం, కాంట్రాక్టర్లను మేపడానికి నిధులు విడుదల చేయడం, ప్రతి పనీ వివాదంలో చిక్కుకుని ముందుకు కదలకపోవడం అనే క్రమాన్ని కొనసాగించారు.</p>
  83.  
  84.  
  85.  
  86. <p>అయితే ప్రస్తుత సమస్య రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ కాదు, జలవివాదాలూ కాదు, అంతకన్న తీవ్రమైన సమస్య రెండు రాష్ట్రాలకూ ఎదురైంది. అది రెండు రాష్ట్రాలలోని అన్ని భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరీ నదీజల నిర్వహణ బోర్డులకు అప్పగిస్తూ సమాఖ్య ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు.&nbsp; సమాఖ్య ప్రభుత్వపు జలశక్తి మంత్రిత్వ శాఖ జూలై 15న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం నీటి విడుదల, నీటి పారుదల, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతించడం వంటి పనులన్నిటి మీద ఈ బోర్డులకే అధికారం ఉంటుంది. రెండు రాష్ట్రాలూ ఇప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ తక్షణమే ఆపవలసి ఉంటుంది.</p>
  87.  
  88.  
  89.  
  90. <p>హిందీలోనూ, ఇంగ్లిష్ లోనూ కలిసి డెబ్బై పేజీలు ఉన్న ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎంత అప్రజాస్వామికంగా, సమాఖ్యభావనకు విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తూ తయారయిందో వివరంగా చర్చించవలసి ఉంది. ఎచ్ అనే ఒకే ఒక్క నిబంధన చూస్తేనే ఇవి ఎంత దుర్మార్గమైన ఉత్తర్వులో అర్థమవుతుంది. కృష్ణా నదీజల నిర్వహణ బోర్డులో “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని చైర్మన్ గా గాని, సభ్య కార్యదర్శిగా గాని, సభ్యులుగా గాని, చీఫ్ ఇంజనీర్లుగా గాని నియమించడానికి వీలులేదు” అని ఆ నిబంధన చెపుతుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారెవరూ ఈ రెండు రాష్ట్రాల గురించి జరిగే చర్చలో భాగం కావడానికి వీలు లేదనడం సంఘ్ పరివార్ గుత్తాధిపత్య రాజకీయాలకు నిదర్శనం. కశ్మీరీల భవిష్యత్తు గురించి జరిగే చర్చలలో భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడ భాగం పంచుకోవచ్చు గాని కశ్మీరీలకు మాత్రం స్థానం లేదని చెప్పే భారత పాలకవర్గాల దృక్పథం అది.</p>
  91.  
  92.  
  93.  
  94. <p>నిజానికి ఇది భారత అధికార వ్యవస్థలో అలవాటైన పద్ధతి కూడ కాదు, పంజాబ్, హర్యానాల మధ్య, తమిళనాడు కర్నాటకల మధ్య, తుంగభద్ర పరీవాహక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడూ, అంతకుముందూ రూపొందించిన మధ్యవర్తి యంత్రాంగాలలో తప్పనిసరిగా ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు ఆ పద్ధతి ఎందుకు వదిలేస్తున్నారో వివరణ లేదు. జలవివాదాలు పరిష్కరించడానికి ఢిల్లీయో సుప్రీంకోర్టో జోక్యం చేసుకోవాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ అప్పుడు ఆ ఆకాంక్షను ఎందుకు వ్యక్తం చేసిందో గాని, ఇప్పుడు ఢిల్లీ బొటనవేలు పెత్తనం కింద నలిగిపోక తప్పదు.</p>
  95.  
  96.  
  97.  
  98. <p>ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సమస్యను తమ మధ్యనే పరిష్కరించుకోవాలనీ, దానికన్న ముఖ్యంగా ఈ ప్రజా సమస్యను తమ రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోగూడదనీ అనుకోవలసి ఉంది. అవి అలా అనుకునేలా ఒత్తిడి తేవలసింది ప్రజలే. &nbsp;&nbsp;</p>
  99.  
  100.  
  101.  
  102. <ul><li><strong>ఎన్ వేణుగోపాల్</strong><strong></strong></li></ul>
  103.  
  104.  
  105.  
  106. <p>ఆగస్ట్ 3, 2021</p>
  107. ]]></content:encoded>
  108. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2021/08/04/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%ae%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6/feed/</wfw:commentRss>
  109. <slash:comments>0</slash:comments>
  110. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  111. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  112. </media:content>
  113. </item>
  114. <item>
  115. <title>మహాప్రస్థానం మహాప్రచురణ – ఒక ఉత్సవ సందర్భం</title>
  116. <link>https://kadalitaraga.wordpress.com/2021/08/01/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b1%81%e0%b0%b0%e0%b0%a3/</link>
  117. <comments>https://kadalitaraga.wordpress.com/2021/08/01/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b1%81%e0%b0%b0%e0%b0%a3/#respond</comments>
  118. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  119. <pubDate>Sun, 01 Aug 2021 13:24:55 +0000</pubDate>
  120. <category><![CDATA[Telugu]]></category>
  121. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=853</guid>
  122.  
  123. <description><![CDATA[శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2021/08/01/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b1%81%e0%b0%b0%e0%b0%a3/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  124. <content:encoded><![CDATA[
  125. <p></p>
  126.  
  127.  
  128.  
  129. <p>శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ శ్రద్ధగా, ప్రేమగా, గొప్ప కళా హృదయంతో, సాంకేతిక నైపుణ్యంతో అలంకరించిన అరసవల్లి గిరిధర్ గారిని కలిశాను. వాళ్లిద్దరూ సాధించిన అద్భుతానికి ప్రశంస ఏ రూపంలో ఇచ్చినా సరిపోదు గాని ఉద్వేగభరితమైన కంటి తడితో, ప్రేమపూర్వక ఆలింగనంతో నా ధన్యవాదాలు చెప్పుకున్నాను.</p>
  130.  
  131.  
  132.  
  133. <p>నిన్న పుస్తకంతో నా ఫోటో, పోస్ట్ మీద వ్యాఖ్యానిస్తూ మిత్రులు కన్నెగంటి రామారావు గారు “మీకు ఈ పుస్తకం ఇంకా అర్థవంతం. ఇప్పటికీ, కవితా ఓ కవితా మద్దిపాటి గారింట్లో మీరు చెప్పడం గుర్తుంది” అని రాసి, జ్ఞాపకాల గని తవ్వకానికి పురికొల్పారు. పదమూడు సంవత్సరాల కింద 2008 జూన్ రెండో వారంలో నేనూ వనజా డెట్రాయిట్ లో మిత్రులు ఆనంద్ – శారదల ఇంట్లో ఉన్నప్పుడు, జూన్ 13 సాయంత్రం మిత్రులు మద్దిపాటి కృష్ణారావు గారి ఇంట్లో ఆరి సీతారామయ్య గారు, కన్నెగంటి రామారావు గారు వంటి డెట్రాయిట్ మిత్రులందరూ కలిశారు. అక్కడ నేను ఒకటి రెండు నా కవితలు చదివి, ఆ తర్వాత శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ చదువుతుంటే కృష్ణారావు గారు రికార్డ్ చేశారు.</p>
  134.  
  135.  
  136.  
  137. <p>మహాప్రస్థానం గురించి తెలుగు పాఠకులకు, సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. గత ఏడు దశాబ్దాలలో అది పుస్తకంగానే కనీసం లక్ష ప్రతులు అచ్చయి ఉంటుంది. అందులో కవితలు విడివిడిగా కవితా సంకలనాలలో, పాఠ్యపుస్తకాలలో, సినిమాలలో, నాటకాలలో, వక్తల ఉపన్యాసాలలో, వేదికల మీద పఠనాలలో లక్షలసార్లు పునరుక్తమై ఉంటాయి. మహాప్రస్థానం మాత్రమే కాక, ఖడ్గసృష్టి, సిప్రాలి, మరోప్రస్థానం, కథలు, నాటకాలు, అనంతం ఎన్నోసార్లు ప్రచురణ అయ్యాయి. ఆయన సమగ్ర రచనలు ఇప్పటికీ కనీసం మూడు ప్రచురణాల్లో వెలువడ్డాయి. మొత్తంగా శ్రీశ్రీ సాహిత్యం మీద, ప్రత్యేకించి మహాప్రస్థానం మీద ఇతరుల రచనలు, వివరణలు, వ్యాఖ్యానాలు నూటయాబై పుస్తకాలైనా వెలువడి ఉండవచ్చు. సింగంపల్లి అశోక్ కుమార్ గారి శ్రీశ్రీ సాహిత్య నిధి ఒక్కటే శ్రీశ్రీ మీద వంద పుస్తకాలు ప్రచురించింది.</p>
  138.  
  139.  
  140.  
  141. <p>అయినా శ్రీశ్రీ మీద తెలుగు సమాజ సాహిత్యాల ఆసక్తి తరగలేదు. తెలుగు సమాజ సాహిత్యాలకు శ్రీశ్రీ అవసరం తీరలేదు. కాఫీ టేబుల్ బుక్ అనే మహా ప్రచురణ చదవడానికి అంత సౌకర్యవంతం కాకపోవచ్చు. అది ఒక గౌరవ ప్రకటన. ఒక ఆత్మీయ సంస్మరణ. ఒక విలువైన స్మరణిక. జాబిల్లిని తలచుకుంటే మనసు వెర్రెత్తి ఇదివరకెవరో అన్నదే, ఇంకా బాగా అన్నదే మళ్లీ వల్లిస్తానని శ్రీశ్రీ అన్నట్టు గానే, మహా ప్రస్థానం మహా ప్రచురణ శ్రీశ్రీ మాటలే వాడుకుని చెప్పాలంటే ‘ఒక చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం.’ ఈ పువ్వు వికసిస్తున్న, ఈ కత్తి దూస్తున్న, ఈ వజ్రం వెలుగులు చిమ్ముతున్న ఈ సందర్భం నిజంగా ఉత్సవం చేసుకోవలసిన సమయం. &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</p>
  142. ]]></content:encoded>
  143. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2021/08/01/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b1%81%e0%b0%b0%e0%b0%a3/feed/</wfw:commentRss>
  144. <slash:comments>0</slash:comments>
  145. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  146. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  147. </media:content>
  148. </item>
  149. <item>
  150. <title>హంతక అసహనం – దభోల్కర్ నుంచి రోహిత్ దాకా</title>
  151. <link>https://kadalitaraga.wordpress.com/2016/02/08/%e0%b0%b9%e0%b0%82%e0%b0%a4%e0%b0%95-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a6%e0%b0%ad%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82/</link>
  152. <comments>https://kadalitaraga.wordpress.com/2016/02/08/%e0%b0%b9%e0%b0%82%e0%b0%a4%e0%b0%95-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a6%e0%b0%ad%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82/#respond</comments>
  153. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  154. <pubDate>Mon, 08 Feb 2016 15:30:41 +0000</pubDate>
  155. <category><![CDATA[Telugu]]></category>
  156. <category><![CDATA[Veekshanam]]></category>
  157. <category><![CDATA[Dalit]]></category>
  158. <category><![CDATA[Rohith]]></category>
  159. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=842</guid>
  160.  
  161. <description><![CDATA[సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2016/02/08/%e0%b0%b9%e0%b0%82%e0%b0%a4%e0%b0%95-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a6%e0%b0%ad%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  162. <content:encoded><![CDATA[<p><img data-attachment-id="849" data-permalink="https://kadalitaraga.wordpress.com/2016/02/08/%e0%b0%b9%e0%b0%82%e0%b0%a4%e0%b0%95-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a6%e0%b0%ad%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82/rohith/" data-orig-file="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg" data-orig-size="225,225" data-comments-opened="1" data-image-meta="{&quot;aperture&quot;:&quot;0&quot;,&quot;credit&quot;:&quot;&quot;,&quot;camera&quot;:&quot;&quot;,&quot;caption&quot;:&quot;&quot;,&quot;created_timestamp&quot;:&quot;0&quot;,&quot;copyright&quot;:&quot;&quot;,&quot;focal_length&quot;:&quot;0&quot;,&quot;iso&quot;:&quot;0&quot;,&quot;shutter_speed&quot;:&quot;0&quot;,&quot;title&quot;:&quot;&quot;,&quot;orientation&quot;:&quot;0&quot;}" data-image-title="Rohith" data-image-description="" data-image-caption="" data-medium-file="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg?w=225" data-large-file="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg?w=225" class="alignnone size-full wp-image-849" src="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg" alt="Rohith" width="225" height="225" srcset="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg 225w, https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg?w=150&amp;h=150 150w" sizes="(max-width: 225px) 100vw, 225px" /></p>
  163. <p>సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల పేరు చేరింది. కాకపోతే అంతకు ముందరి నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం ఎం కల్బుర్గి, మహమ్మద్ అఖ్లాక్ లను సంఘ్ పరివార్ శక్తులు ప్రత్యక్షంగా హత్య చేయగా, రోహిత్ వేములది ఆత్మహత్యగా కనిపించే వ్యవస్థీకృత హత్య. కేవలం భిన్నాభిప్రాయాలు ఉన్నందువల్ల ఈ దేశంలో హిందూ బ్రాహ్మణీయ హంతక భావజాలానికీ, దాని ఉగ్రరూపమైన సంఘ్ పరివార్ దాడులకూ బలి అయినవారిలో రోహిత్ వేముల మొదటివారూ కాదు, చివరివారూ కాకపోవచ్చు. కాని ఒక అత్యున్నత విద్యాసంస్థలో పరిశోధక విద్యార్థిగా, విశాలమైన సృజనాత్మక ఆలోచనలు, అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి ఉన్న మేధావిగా ఆయన మరణం అత్యంత విచారకరమైనది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులు, మరణానంతర ప్రజాగ్రహం, ఆ ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న తప్పుడు వాదనలు సమాజం తీవ్రంగా పట్టించుకోవలసిన, ఆలోచించవలసిన ఎన్నో మౌలిక అంశాలను లేవనెత్తుతున్నాయి.</p>
  164. <p>ఆత్మహత్యగా కనబడుతున్న రోహిత్ ది నిజానికి వ్యవస్థ చేసిన హత్య అనడానికి అనేక కారణాలున్నాయి. సమాజంలో అసంఖ్యాకుల పట్ల అమలవుతున్న అసమానతలను, అవమానాలను, వివక్షను హిందూ బ్రాహ్మణీయ భావజాలం నిర్దేశిస్తున్నది. అపౌరుషేయమని చెప్పే రుగ్వేదంలోని పురుషసూక్తం, స్వయంగా భగవంతుడి నోటి నుంచి వెలువడినట్టు చెపుతున్న భగవద్గీత, సమాజ ధర్మశాస్త్రంగా వెలువడిన మనుస్మృతి వర్ణాశ్రమ ధర్మాన్ని, అంతరాలను, వివక్షను స్పష్టంగా నిర్దేశించి అసమానతలకు మత ఆమోదాన్ని ప్రకటించాయి. సమాజంలోని అత్యధిక సంఖ్యాకులను విద్యకూ, సామాజిక జీవితానికీ, సంస్కృతికీ, రాజకీయాలకూ, అధికారానికీ దూరం చేయాలని హిందూ ధర్మపు ప్రధాన గ్రంథాలన్నీ ఘోషించాయి. ఆ గ్రంథాల గురించి తెలియకపోయినా, అవి చదవకపోయినా అవి ప్రబోధించే విలువలు సమాజ సంస్కృతిగా మారినందువల్ల ఆ విలువలను పాటించేవారు విస్తృతంగా ఉన్నారు. అసమానతల, నిచ్చెనమెట్ల వ్యవస్థ సహజమైనదనీ, దాన్ని ఆమోదించి, పునరుత్పత్తి చేయడం కన్న మనుషులు చేయగలదేమీ లేదనీ అనుకునే స్థితి వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అసమానతలను, వాటికి మూలమైన మత-కుల వ్యవస్థలను ప్రశ్నించిన గొంతులను నులిమేయడం కూడ వందల సంవత్సరాలుగా జరుగుతున్నది. కాలక్రమంలో మతం వ్యక్తిగత విశ్వాసం స్థాయి నుంచి సామూహిక మతోన్మాద హింస స్థాయికి మారింది. రాజ్యమూ మతమూ కలగలిసిన విష కషాయానికి సామ్రాజ్యవాదం రంగులద్దింది.</p>
  165. <p>ఇదీ ఇవాళ భారత సమాజంలో హిందూ బ్రాహ్మణీయ భూస్వామ్య సామ్రాజ్యవాద దళారీ శక్తుల మిలాఖత్తు. ఈ దుర్మార్గ పాలనలో పుట్టుకే ఒక ప్రాణాంతక ప్రమాదం. పుట్టకముందే అత్యధికుల పేర్లు దేశద్రోహుల, మతద్రోహుల, అవమానితుల, బహిష్కృతుల జాబితాలో చేరిపోతున్నాయి. ఇక వారు జీవితాంతం ఆ శిలువ మోస్తూ ఒంటరితనంలో బతకవలసిందే. అలా మత, కుల అసమానతల వ్యవస్థ చేసిన హత్య రోహిత్ ది.</p>
  166. <p>ఆధునిక సమాజంలో కుల అసమానతలు, కుల వివక్ష ఉండగూడదని, మనుషులందరూ సమానమేనని, తరతరాలుగా వివక్షకు, అవకాశాల నిరాకరణకు గురైన సమూహాలకు రక్షణలు కల్పించాలని ఎన్నో ఉద్యమాలు, ఎందరో ఆలోచనాపరుల చర్చల ఫలితంగా విద్యారంగంలో దళితుల ప్రవేశానికి అవకాశం దొరికినప్పటికీ, అప్పటికే విద్యాసంస్థలను ఆక్రమించుకుని కూచున్న అగ్రవర్ణాలు వాటిని అగ్రహారాలుగా మార్చాయి. విద్యాలయాలలో కూడ సామాజిక అసమానతలను, వివక్షను, కుల, మత విద్వేషాలను పెంచి పోషించే సంఘ్ పరివార్ సంస్థలూ పుట్టుకొచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలకూ సంఘ పరివార్ సంస్థలకూ మధ్య ఉన్న మిలాఖత్తు ఫలితమే రోహిత్ మీద, మరి నలుగురు దళిత విద్యార్థుల మీద అమలయిన సాంఘిక బహిష్కార శిక్ష. ఆ రకంగా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.</p>
  167. <p>మన సమాజంలో సమసమాజ ఆలోచనలు, ప్రగతిశీల ఉద్యమాలు, దళిత అనుకూల సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా బహిష్కృత దళిత విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కునే పరిస్థితి లేకపోవడం, వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒంటరితనాన్ని, వెలివాడ లోని స్థితిని అనుభవించవలసి రావడం ప్రగతిశీల ఉద్యమాలన్నీ తమను తాము ప్రశ్నించుకోవలసిన సవాళ్లను ముందుకు తెస్తున్నాయి. సామాజిక అసమానతలకు వ్యతిరేక చైతన్యం అవసరమైన స్థాయిలో ప్రచారం కాలేదని, కుల దురభిప్రాయాలు, కుల వివక్షా ఆలోచనలు ఇంకా బలంగానే ఉన్నాయని, కుల వివక్ష మీద పోరాటం ఇంకా అవసరమైన స్థాయిలో జరగడం లేదని చేదు నిజాలను రోహిత్ హత్య చూపుతున్నది. ఆ రకంగా రోహిత్ హత్య మన సమాజంలో ప్రగతిశీల ఆలోచనల, ఆచరణల లోపాలనూ, వైఫల్యాలనూ ప్రకటిస్తున్నది. అలా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.</p>
  168. <p>ఈ నేపథ్యంలో కంటికి కనబడుతున్న ప్రత్యక్ష శత్రువులకు, హంతకులకు శిక్షలు పడాలని, రోహిత్ కు న్యాయం జరగాలని ఎలుగెత్తడం ఎంత అవసరమో, ఈ హత్య వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను అన్వేషించి, వాటిని తొలగించే దిశగా ఆలోచనలనూ ఆచరణలనూ పెంచుకోవడం అంత అవసరం. హిందూత్వ భావజాలపు దుర్మార్గానికీ, కుల వివక్షకూ, సంఘ్ పరివార్ శక్తుల దౌర్జన్యాలకూ, విద్యాసంస్థల యాజమాన్యాల నిరంకుశత్వానికీ, ప్రగతిశీల శక్తులలో ఉన్న అలసత్వానికీ వ్యతిరేకంగా చైతన్యాన్ని సమీకరించడం, పోరాడడం ఇవాళ ఎంత తక్షణ అవసరమో రోహిత్ హత్య చెపుతున్నది. గత రెండు సంవత్సరాలుగా పెచ్చరిల్లిన సంఘ్ పరివార్ హంతక అసహనం మీద కేంద్రీకరిస్తూనే, వ్యవస్థాగత కారణాలన్నిటి మీదా పోరాటం ఎక్కు పెట్టడమే ఇవాళ్టి చారిత్రక కర్తవ్యం.</p>
  169. <p>(వీక్షణం ఫిబ్రవరి 2016 సంపాదకీయం)</p>
  170. ]]></content:encoded>
  171. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2016/02/08/%e0%b0%b9%e0%b0%82%e0%b0%a4%e0%b0%95-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a6%e0%b0%ad%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82/feed/</wfw:commentRss>
  172. <slash:comments>0</slash:comments>
  173. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  174. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  175. </media:content>
  176.  
  177. <media:content url="https://kadalitaraga.files.wordpress.com/2016/02/rohith.jpg" medium="image">
  178. <media:title type="html">Rohith</media:title>
  179. </media:content>
  180. </item>
  181. <item>
  182. <title>ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!</title>
  183. <link>https://kadalitaraga.wordpress.com/2013/01/03/%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95-%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/</link>
  184. <comments>https://kadalitaraga.wordpress.com/2013/01/03/%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95-%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/#comments</comments>
  185. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  186. <pubDate>Wed, 02 Jan 2013 22:15:21 +0000</pubDate>
  187. <category><![CDATA[వ్యాసాలు]]></category>
  188. <category><![CDATA[Ee Bhoomi]]></category>
  189. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=832</guid>
  190.  
  191. <description><![CDATA[ఈభూమి జనవరి 2013 సంచిక కోసం డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2013/01/03/%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95-%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  192. <content:encoded><![CDATA[<p style="text-align:justify;" align="center"><span style="text-decoration:underline;">ఈభూమి జనవరి 2013 సంచిక కోసం</span></p>
  193. <p style="text-align:justify;">డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ విపరీతంగా కొట్టి దాదాపు స్పృహలేని స్థితిలో రోడ్డు పక్కన పడేసి పోవడం, ఆ హింస ఫలితంగా పేగులన్నీ చితికిపోయి, ఎన్నో అవయవాలు దెబ్బతిని, పదమూడు రోజుల చికిత్స తర్వాత ఆ యువతి మరణం&#8230; ఈ ఘటనా పరంపర హృదయం ఉన్న వారినెవరినైనా కంట తడి పెట్టించేంత కర్కోటక పరిణామాలు. మనిషిగా స్పందించే వారెవరిలోనైనా నేరస్తుల పట్ల కసి రగిలించే పాశవిక సంఘటనలు.<span id="more-832"></span></p>
  194. <p style="text-align:justify;">నిజంగానే దేశం తనకింకా ఎక్కడో లోలోతుల్లోనయినా హృదయం ఉందని చూపెట్టుకుంది. దేశం యావత్తూ కంట తడి పెట్టింది. ఎన్నడూ పత్రికావార్తలను, సమాజ పరిణామాలను పట్టించుకోని వారు కూడ కదలిపోయారు. నిజంగానే రాజధానీ నగరం నడిబొడ్డునా, దేశంలో అనేక చోట్లా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ముఖ్యంగా రాజధానిలో లక్షలాదిగా యువతీయువకులు కదిలి వచ్చి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గమా, ఇంత దుర్మార్గం జరిగినా ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. నేరస్తులకు కఠినాతి కఠిన శిక్షలు విధించాలనే ఆకాంక్ష ఢిల్లీలోనూ, దేశమంతా కూడ పెల్లుబికింది. ప్రభుత్వం మాత్రం యథావిధిగా ప్రదర్శనకారులను అనుమతి నిరాకరించడానికి ప్రయత్నించింది. అయినా వచ్చిన ప్రదర్శనకారుల మీద లాఠీలు, బాష్పవాయువు, వాటర్ కానన్లు ప్రయోగించి తన ఉదాసీనత ఎంత ఘనమైనదో చాటుకుంది. తనది ఎంత మొద్దు చర్మమో వెయ్యిన్నొకటోసారి ప్రకటించింది.</p>
  195. <p style="text-align:justify;">ఆ ఔదాసీన్యం, నిరసనకారుల మీద దౌర్జన్యంతో పాటుగానే ప్రభుత్వ స్పందనలో ఈ సారి కొంత అనూహ్య, అసాధారణ పార్శ్వం కూడ ఉంది. ప్రభుత్వం వెంటనే ఒక న్యాయవిచారణ సంఘాన్ని నియమించి, మూడు నెలలలోపల ఆ విచారణ సంఘం తన సిఫారసులను తెలియజేయాలని ఆదేశించింది. బాధిత యువతికి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో జరుగుతున్న చికిత్స సరిపోవడం లేదని భావించి, ఇటువంటి హింసాఘాతాలకు చికిత్స చేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించింది. ఎన్నో అవయవాలు దెబ్బ తిని, అప్పటికే పేగులు తొలగించబడి ఉన్నందువల్ల ఆ యువతి ప్రాణాలు కాపాడడం ఎంత ఉన్నత ప్రమాణాల చికిత్స అందినా సాధ్యం కాలేదు.</p>
  196. <p style="text-align:justify;">అత్యాచార సమాచారం వెలుగులోకి వచ్చిన డిసెంబర్ 17 నుంచి యువతి మరణించిన డిసెంబర్ 29 దాకా, ఆ తర్వాత కూడ ఈ ఘటనా పరంపరకు ప్రచార, ప్రసార సాధనాలలో చాల ఎక్కువ చోటు దొరికింది. రాష్ట్రపతి, యుపిఎ చైర్ పర్సన్, ప్రధానమంత్రిల నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకూ ఎందరెందరో స్పందించారు. స్వయంగా సోనియా గాంధీ, షీలా దీక్షిత్, జయా బచ్చన్ వంటివారు బహిరంగంగా కంటతడి పెట్టారు. సామాజిక, సాంస్కృతిక జీవనంలోని ప్రముఖులెందరో ఈ ఘటనా పరంపర మీద తమ వ్యాఖ్యానాలు వినిపించారు. వీథుల్లోకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. అనేక రూపాలలో నిరసన ప్రకటించారు. నిరసనను అడ్డుకున్న పోలీసులతో వీథిపోరాటాలు చేశారు.</p>
  197. <p style="text-align:justify;">ఒక యువతి మీద జరిగిన అత్యాచారం మీద ఇటువంటి స్పందన రావడం చాల ఆహ్వానించదగిన పరిణామం. ఇంతకాలం సమాజ పరిణామాల పట్ల ఎటువంటి స్పందన లేకుండా తమ జీవితాలు తాము గడుపుతున్న ఉన్నతవర్గ, ఉన్నత మధ్యతరగతి యువతీయువకులు ఢిల్లీ చలిలో ఇండియా గేట్ దగ్గర బహిరంగ వీథి ప్రదర్శనలకు దిగడం చాల ప్రశంసనీయం. ఈ మొత్తం ప్రదర్శనల లోను, ప్రకటనల లోను ఆ అత్యాచార నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలనే ఆకాంక్ష ప్రధానంగా వ్యక్తమయింది. భారత శిక్షా స్మృతిలో అత్యాచార నేరం గురించి మాట్లాడే సెక్షన్ 375ను కఠినతరం చేయాలని, ఇప్పుడున్న శిక్షలకన్న కఠినశిక్షలు విధించాలని, మరణశిక్ష మాత్రమే సరైన శిక్ష అని, నేరస్తులను బహిరంగంగా ఉరి తీయాలని, నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాలని, నేరస్తులకు ఎద్దుకొట్టడం (శస్త్రచికిత్స ద్వారా గాని, రసాయనిక చర్య ద్వారా గాని   నపుంసకుడిని చేయడం) లాంటి శిక్షలు విధించాలని ఎన్నో సూచనలు, డిమాండ్లు పెల్లుబికాయి. అంతకన్న ఆలోచించవలసిన లోతయిన విషయాలు ఉన్నాయని అక్కడక్కడా కొన్ని గళాలు వినిపించినా అవి అంత బలంగా వినిపించలేదు.</p>
  198. <p style="text-align:justify;">ఈ ఘటనా పరంపరలో వెల్లువెత్తిన ఈ ఆలోచనలూ ఆకాంక్షలూ అన్నిటినీ, జరిగిన దుర్మార్గపు తీవ్రత వల్ల వస్తున్న తక్షణ ప్రతీకార వాంఛలుగా చూస్తే ఫరవాలేదు. ఇవే దీర్ఘకాలిక, సామాజిక, పాలనాపర వైఖరులు అయితే ఒక తప్పును సరిచేసే క్రమంలో మరెన్నో తప్పులకు దారి తీసినట్టవుతుంది. ఈ డిమాండ్లు తెలిసీ తెలియని యువతీయువకులు ఆగ్రహావేశాలతో వెల్లడిస్తే ఫరవాలేదు, సమాజ నిర్వాహకులుగా ఉన్న, సమాజగమన సారథులుగా ఉండవలసిన రాజకీయపక్షాల నాయకులూ, మేధావులుగా, విశ్లేషకులుగా చలామణీ అవుతున్నవాళ్లూ కూడ వ్యక్తం చేయడం ప్రమాదకరం.</p>
  199. <p style="text-align:justify;">ఈ నేపథ్యంలో స్త్రీలపై అత్యాచారం అనే నేరం పట్ల మన సమాజంలో ఉన్న అభిప్రాయాలను మరొకసారి పరిశీలించుకోవలసి ఉంది. ఈ ఘటన తీవ్రత వల్ల, జరిగిన దుర్మార్గపు పద్ధతి వల్ల, దొరికిన ప్రచారం వల్ల కదిలిపోయి ఏదో ఒక రోజో, ఒక వారమో కొవ్వొత్తులు పట్టుకుని ప్రదర్శన చేయగానే సరిపోదు. ఈ ఘటనలో బాధితురాలిపట్ల ఒక కన్నీటి చుక్క వదిలితే సరిపోదు. ఈ ఘటన నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తే సరిపోదు.</p>
  200. <p style="text-align:justify;">ఇంతకూ నేరస్తులెవరు? ఆ రోజు అర్ధరాత్రి బస్సులో ఆ అత్యాచారానికి ఒడిగట్టిన ఆరుగురు మాత్రమేనా? ఆ ఆరుగురి ప్రాణాలు తీస్తే, లేదా కొందరు వాదిస్తున్నట్టు వారిని ఎద్దుకొడితే, లేదా నేరశిక్షాస్మృతిలో అత్యాచార నేరానికి మరణశిక్ష విధిస్తే సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు ఆగిపోతాయా? ఈ నేరంలో సమాజం పాత్ర, సంస్కృతి పాత్ర, విలువల పాత్ర ఎంతో ఆలోచించుకుని వాటిని సంస్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎంత కఠినమైన శిక్షలు విధించినా ప్రయోజనం ఏమిటి?  ఇంత దుర్మార్గ ఘటన అయినా మనలో సమగ్రమైన ఆలోచనలు రేపకపోతే, కేవలం ఇప్పటికిప్పుడు తోచిందేదో చేసి అదే అంతిమం అనుకుంటే సరిపోదని ఈ పదమూడు రోజులలో కూడ జరిగిన ఎన్నో అత్యాచార ఘటనలు రుజువు చేస్తున్నాయి. దేశంలో స్త్రీల మీద జరిగిన అత్యాచారాలన్నీ నమోదు కానే కావు గాని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారిక లెక్కల ప్రకారం 2011లో నమోదైన అత్యాచారాల సంఖ్య 24,206. అంటే సగటున ప్రతి రోజూ 66 మంది, ప్రతి అరగంటకు ఒకరు అత్యాచారానికి బలి అవుతున్నారు. ఈ వ్యాసం చదవడం ప్రారంభించి ముగించేలోపు దేశంలో ఎక్కడో ఒక చోట ఒక స్త్రీ అత్యాచారానికి గురై ఉంటుంది. కొనసాగుతున్న సాంస్కృతిక విలువల వల్ల ప్రతిక్షణం ఒక అత్యాచార నేరస్తుడు తయారవుతూ ఉంటాడు. వీటిలో ఎన్ని అత్యాచారాల గురించి, ఎన్ని అత్యాచారాల ప్రేరణల గురించి ఆలోచిస్తున్నాం మనం? ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అకృత్యాన్ని నిజంగా ఆపాలంటే ఎన్ని పాతర్ల లోతు నుంచి మారవలసి ఉంది మనం? అసలు ఇటువంటి అత్యాచారం మాత్రమే కాదు, ఇటువంటి అత్యాచారాలకు పురికొల్పే పురుషాధిపత్య, స్త్రీ వ్యతిరేక, అసమానతా భావజాలాన్ని కడిగేసుకోవడానికి మనకు మనం ఎంత సుదీర్ఘ కష్టభరిత శిక్షణ ఇచ్చుకోవలసి ఉంటుంది?</p>
  201. <p style="text-align:justify;">ఆ పారామెడికల్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు ఆ రోజు రాత్రి సినిమా చూసి ఇంటికి వెళ్తూ ఉండడం, ఆ సమయానికి మరొక బస్సు దొరకక ఈ బస్సు ఎక్కడం, ఆ బస్సులో ఆ ముష్కరులు కాక మరెవరూ లేకపోవడం యాదృచ్ఛికం కావచ్చు గాని, ఆ అత్యాచారం మాత్రమే కాదు, అసలు స్త్రీల మీద అత్యాచారాలనేవి యాదృచ్ఛికం కావు. అదేదో హఠాత్తుగా అనుకోకుండా జరిగిపోయే సంఘటన కాదు. ఒక స్త్రీ మీద జరిగిన అత్యాచారం ఆ నేరస్తుల కామప్రకోపానికి మాత్రమే సూచన కాదు. దాని వెనుక ఉన్న సుదీర్ఘ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, పితృస్వామ్య ఆలోచనలను గుర్తించవలసి ఉంది. వాటిని గుర్తించి వాటిని పరిహరించడానికి, తగ్గించడానికి ఏం చేయగలం, ఏం చేస్తున్నాం అని ఆలోచించకపోతే, అప్పుడప్పుడు ఇటువంటి ఏదో ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు తాటాకు మంట లాగ ఆవేశపడడం, మర్నాటికల్లా మరచిపోవడం జరుగుతాయి. అప్పుడిక మన ప్రతిస్పందనలు తక్షణ ప్రతీకారానికీ, ఉపరితల ఉపశమనాలకూ మాత్రమే పరిమితమవుతాయి గాని దీర్ఘకాలిక సవరణలకు, లోతయిన పరిష్కారాలకు దారితీయవు. కావలసింది శిక్ష మాత్రమే కాదు, సరైన శిక్షణ.</p>
  202. <p style="text-align:justify;">తప్పకుండా ఈ నేరస్తులకు కఠినమైన శిక్షలు పడవలసిందే. నేరానికి తగిన శిక్ష ఉండవలసిందే. అందులో మరొక అభిప్రాయం లేదు. కాని నేరాలు జరగడానికి మూలకారణమేమిటో తెలుసుకుని, ఆ మూలకారణాన్ని రద్దుచేసేదాకా, తగ్గించేదాకా నేరాలు ఆగవు. మూలకారణాలదాకా కూడ పోనక్కరలేదు. కఠినమైన శిక్షలు నేరాలను తగ్గిస్తాయనే భ్రమలను మొదట వదులుకోవాలి. ఆ అమాయక ఆలోచనకు చరిత్రలో ఎక్కడా ఆధారం లేదు. నిజానికి శిక్షాభయానికి నేరం జరగకుండా ఉండడమనేది ఎక్కడాలేదు. శిక్ష బెదురుగా పని చేస్తుందని, ఆ భయంతో నేరస్తులు నేరం చేయకుండా ఉంటారని ఒక సైద్ధాంతిక వాదన. ఆ వాదనతోనే శిక్షాస్మృతిని కఠినంగా తయారు చేయడం, అధికారవర్గాల అధికారాన్ని పెంచడం జరుగుతున్నది గాని ఆ సైద్ధాంతిక వాదన తప్పు, శిక్షాభయంతో ఒకటో రెండో నేరాలు ఆగిపోవచ్చుగాని, ఆ నేరాలు జరిగే పరిస్థితులు మారేదాకా నేరాలు ఆగవు. ఇక ఆపేరుతో శిక్ష విధించే, అమలు చేసే వ్యవస్థలకు ఎక్కువ అధికారాలు ఇస్తే ఆ అధికారులు ఆ అదనపు అధికారంతో సమాజం మీద ప్రశ్నించడానికి వీల్లేని పెత్తందారీ దౌర్జన్యం చేయడానికి దారి దొరుకుతుంది గాని నిజంగా నేరాలనేమీ ఆపడం లేదని చరిత్ర పొడవునా లక్షల నిదర్శనాలున్నాయి. ఈ నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాలని, ఎన్ కౌంటర్ అనే దుర్మార్గ, చట్టవ్యతిరేక, విచారణాతీత శిక్షాపద్దతిని కె. నారాయణ వంటి సిపిఐ నాయకుడే సమర్థిస్తే ఇక సమాజంలో చట్టబద్ధపాలన, క్రమబద్ధ విచారణ, ఒక న్యాయస్థానం తప్పుడు తీర్పు చెపితే పై న్యాయస్థానానికి నివేదించుకునే అవకాశం వంటి ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతులు ఏం కావాలి?</p>
  203. <p style="text-align:justify;">మరణ శిక్ష ఉందనే భయంతో హత్యానేరాలు ఆగడం లేదు. అది నేరమని, కఠిన శిక్షలు ఉన్నాయని తెలిసినా దళితుల మీద అత్యాచారాలు ఆగడం లేదు. వరకట్నం తీసుకోవడం ఆగడం లేదు. లంచం తీసుకోవడం ఆగడం లేదు. ఈ ఉదాహరణలన్నీ చూపేదేమంటే ఒక పని నేరం అని తెలిసినా చేసేవాళ్లుంటారు. పథకం ప్రకారం ఆ పనిచేసే వారిని ఎటువంటి శిక్షాభయం కూడ ఆపదు. క్షణికావేశంతో ఆ పనిచేసేవారు అసలు ఆలోచన, తర్కం నశించిన సమయంలోనే ఆ పని చేస్తారు గనుక వారికి  శిక్షాభయం కలగనే కలగదు. కనుక తెలిసి చేసేవారి విషయంలోనైనా, పరిస్థితులు తోస్తే చేసేవారి విషయంలోనైనా కఠిన శిక్షలు అనేది సమస్యే కాదు.</p>
  204. <p style="text-align:justify;">ఇది సాధారణంగా నేరం – శిక్ష ప్రక్రియకు సంబంధించిన వాదన కాగా, స్త్రీల మీద అత్యాచార నేరం పథకం ప్రకారం జరిగే సందర్భాలూ ఉంటాయి, క్షణికమైన కామోద్రేకం వల్ల జరిగే సందర్భాలూ ఉంటాయి. పథకం ప్రకారం జరిగే అత్యాచార నేరాలు శిక్షాభయంతో తగ్గవు. అయినా వారికి శిక్షవిధించాలి గనుక కఠిన శిక్షలు ఉండవలసిందే. ఇక కామోద్రేకం కూడ క్షణికం అనిపిస్తుంది గాని స్త్రీపురుష అసమానత నిండిన పితృస్వామిక సమాజంలో అది నిజంగా క్షణికమైనదో, మదోన్మత్తత అనే అప్పటికప్పుడు పుట్టుకు వచ్చే లక్షణమో కాదు. అది మన సమాజంలో ప్రతి మగవాడికీ పుట్టుక నుంచి మరణం దాకా నూరిపోయబడుతున్న, సామాజికీకరణలో భాగమైన ఒక సాంస్కృతిక లక్షణం. ఆ లక్షణాన్ని మన మగవాళ్లలో పెంచి పోషించడానికి మతం ఉంది, చారిత్రక వారసత్వం ఉంది, స్వయంగా దైవమే పితృస్వామిక భావజాలానికి మూలమైన సమాజం మనది. అవన్నీ కాకపోతే ఇవాళ్టికివాళ మన విద్యావిధానం, మన ప్రచార సాధనాలు, మన వినోద సాధనాలు, మన వాడకంలోకి వస్తున్న ఆధునిక వస్తువులు, మన పాలనా వ్యవస్థ అన్నీ కూడ అదే నేర్పుతున్నాయి.</p>
  205. <p style="text-align:justify;">స్త్రీ పురుషుడికన్న తక్కువ. స్త్రీ పురుషుడి భోగవస్తువు, స్త్రీకి ఇష్టాయిష్టాలు లేవు, స్త్రీని అణచి ఉంచాలి, స్త్రీ ఆలోచనలకు విలువ ఇవ్వనక్కరలేదు అని మగవాళ్లకు చిన్ననాటి నుంచీ నూరిపోసి, సినిమాలలో, టెలివిజన్ లో, విద్యలో, సమాజంలో స్త్రీ కనబడితే భోగవస్తువులా, ఖాద్యవస్తువులా చూసే దృక్పథాన్ని మెదళ్లలో నింపి, అత్యాచారం చేయడానికి మగవాడికి ఎంత లైసెన్స్ ఇస్తున్నాం మనం?! దేవుడే ఒక అవతారంలో ఎనిమిది మంది భార్యలను చేసుకున్నాడు. పదహారువేల మంది స్త్రీలను తన భోగవస్తువులుగా ఉంచుకున్నాడు. ఉంపుడుగత్తె అనే రాచరిక భూస్వామ్య వాసనల మాట పలకడానికి ఎబ్బెట్టుగా భావించిన మనం ఇప్పుడు ‘చిన్న ఇల్లు’ ‘సెటప్’ అని అత్యాధునికంగా, నాజూకుగా పిలవడమూ అలవాటు చేసుకున్నాం. ఒక రాజు తన దాయాదులను అవమానించడానికి నిండు సభలో సమస్త పరివారం చూస్తుండగా ఆ దాయాదుల స్త్రీకి వస్త్రాపహరణం చేయించాడు. ఆ సంఘటనా ఈ హస్తినాపురిలోనే కొన్ని వేల ఏళ్ల కింద జరిగింది. ఆ ప్రాచీన గతం నుంచి ఇవాళ నడుస్తున్న బస్సులో చుట్టూ ఆరుగురు మూగి దౌర్జన్యంతో అత్యాచారం చేసి, దుర్మార్గమైన చిత్రహింసలు పెట్టి, బైటికి తోసిన వర్తమానం దాకా దేశ రాజధాని హస్తినాపురానిది, మన సమాజానిది మహాఘనత వహించిన అమానుష చరిత్ర. ఈ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని తోసివేయడానికి, కనీస ప్రజాస్వామిక భావనలను, స్త్రీపురుష సమానత్వాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నించామా?</p>
  206. <p style="text-align:justify;">కడుపులో పిండ దశలో ఉండగానే, జన్మించబోయే శిశువు స్త్రీ అని తెలుసుకుని, భ్రూణహత్యలకు పాల్పడుతున్నాం. ఆ భ్రూణ హత్యలు నేరం అని ఎంత కఠినమైన చట్టం ఉన్నా పరీక్షలు చేసే ప్రయోగశాలలూ వైద్యులూ తగ్గలేదు, పరీక్ష చేయించుకుని గర్భస్రావాలు చేయించే కుటుంబాలూ తగ్గలేదు. నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న పిండాలూ, గర్భిణి యువతులూ తగ్గలేదు.</p>
  207. <p style="text-align:justify;">మెరుపు మెరిస్తే వానకురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే అమాయకపు వయసులోనే మన ఇంటి మహాలక్ష్మి అని పొగడుతూనే స్త్రీపురుష భేదాన్ని పాటించి, చిన్నారి ఆడపిల్లల మీద వివక్షను పాటిస్తున్నాం. ఆడపిల్లను మగపిల్లవాడితో సమానంగా సంపూర్ణ మానవిగా చూడలేకపోతున్నాం. లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తున్నాం. గుండెల మీద కుంపటి అని ఆమె ముందే అని ఆమెను అవమానిస్తున్నాం. చదువు ఎందుకు అని బోన్ సాయి చెట్టులా ఎదగకుండా కొమ్మలు విరిచి కడుతున్నాం. కౌమారం దాటకుండానే మగపిల్లలకు స్త్రీ భోగవస్తువనే ఆలోచనలు మప్పుతున్నాం. సినిమాలు, సినిమా పాటలు, ఆ పాటల్లో బూతు, టెలివిజన్ కార్యక్రమాలు, సెల్ ఫోన్లలో బూతు చిత్రాలు, సామాజికీకరణలో ఎక్కడ చూస్తే అక్కడ మొత్తంగా అసహజ, వికృత సెక్స్ ఆకలిని పెంచి పోషిస్తున్నాం. స్త్రీపట్ల అటువంటి అసహజ, వికృత వాంఛలను బలోపేతం చేసే మద్యం అమ్ముకోకపోతే ప్రభుత్వాలు గడవవని, ఇంకా ఇంకా ఎక్కువ తాగాలని కోటాలు విధిస్తున్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రతి యువకుడినీ అవకాశం దొరికితే అత్యాచార నేరస్తుడు కాగలిగిన అవకాశం కలిపిస్తున్నాం.</p>
  208. <p style="text-align:justify;">మరి ఈ సమాజం మారడం ఎక్కడ మొదలుపెట్టాలి? ఇన్ని ఇన్ని దుష్ప్రభావాలు మగవాడ్ని మనిషి కాకుండా చేస్తుంటే, మృగంగా మారుస్తుంటే, ఒక్క శిక్షాభయం మాత్రమే వాడ్ని మనిషిని చేస్తుందా?</p>
  209. <p style="text-align:justify;">అట్లాగే అత్యాచారం అనేది కేవలం పురుషుడిలోని వికృత కామ వాంఛ ఫలితమే అనే దురభిప్రాయం వల్ల కూడ ఎద్దు కొట్టడం (నపుంసకుడిగా తయారు చేయడం) వంటి శిక్షలు ఉండాలనే వాదనలు, స్త్రీలు ఒంటరిగా తిరగగూడదని, రాత్రుళ్లు తిర్గగూడదని, “రెచ్చగొట్టే దుస్తులు” వేసుకోగూడదని వాదనలు వస్తున్నాయి. ఈ చర్యలో పురుషుడి కామ ప్రవృత్తి పాత్ర ఉన్నమాట నిజమే గాని, చాల సందర్భాలలో ఇది కేవలం కామ ప్రవృత్తి ఫలితం కాదు. సాధారణంగా అత్యాచారం చేసేవాడి ఆధిపత్య ప్రదర్శనకు, హింసకు సూచిక. దేశవ్యాప్తంగా స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల ఘటనలను పరిశీలిస్తే, పోలీసులు, అర్ధసైనిక బలగాలు, సైనిక బలగాలు, పెత్తందారీ శక్తులు, అగ్రవర్ణాలు అత్యాచార నేరస్తులలో అగ్రభాగాన నిలుస్తున్నారు. వారు స్త్రీలను, తమ ప్రత్యర్థి వర్గాలను, ప్రశ్నించేవారిని, ఎదుగుతున్నవారిని అణచివేయడానికి, వారికి ఒక “పాఠం” చెప్పడానికి  సాధనంగా అత్యాచారం అనే ఆయుధాన్ని వాడుతున్నారు. ఈ దేశంలో కశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో సైనిక అర్ధసైనిక బలగాలు స్త్రీల మీద చేసిన అత్యాచారాల సంఖ్య వేలల్లో ఉంది. దేశవ్యాప్తంగా పోలీసు కస్టడీలలో అత్యాచారాల సంఖ్య కూడ వేలల్లో ఉంది. విచారణ జరగడమూ, శిక్షలు పడడమూ సంగతి  అలా ఉంచండి, ఇవేవీ వార్తలు కావు, చర్చకు కూడ రావు, ఇక అగ్రవర్ణాలు, ఆధిపత్యవర్గాలు ఆదివాసుల మీద, దళితుల మీద, వెనుకబడిన సామాజిక వర్గాల మీద ఆత్యాచారాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాయి. అధికార వర్గాలకు తమ అధికారాన్ని చూపుకోవడానికి అత్యాచారం ఒక సాధనంగా ఉంది. దేశంలో శాసనసభ్యులలో, పార్లమెంటు సభ్యులలో, వారి ఆశ్రితులలో, సంపన్నులలో అత్యాచార సంస్కృతి విపరీతంగా పెరిగిపోతున్నది.</p>
  210. <p style="text-align:justify;">ఆదివాసి ఉపాధ్యాయురాలు సోని సోరిని చత్తీస్ గడ్ పోలీసులు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి స్వయంగా జిల్లా ఎస్ పి సమక్షంలో అత్యాచారం చేశారు. ఎస్ పి ఆదేశాల మేరకు ఆమె మర్మావయవాలలో రాళ్లు జొప్పించారు. ఆ అత్యాచారం మీద కేసు లేదు సరిగదా, ఆ ఎస్ పి కి రిపబ్లిక్ డే ఉత్సవాలలో శౌర్య పతకం దక్కింది. మణిపుర్ లో అస్సాం రైఫిల్స్ అనే అర్ధసైనిక బలగాల శిబిరంలో మనోరమ అనే యువతిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ అత్యాచారం, హత్యలపై కేసు లేదు. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అస్సాం రైఫిల్స్ కార్యాలయం ముందర మణిపురి యువతులు నగ్న ప్రదర్శన చేసినా భారత జాతి సిగ్గుపడలేదు. కశ్మీర్ లో షోపియన్ పట్టణంలో ఆసియా, నీలొఫర్ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లపై సి అర్ పి ఎఫ్ జవాన్లు అత్యాచారం చేసి, చంపి కాలువలో పారవేస్తే, ఆ పట్టణమంతా రెండు వారాల పాటు నిరసన తెలిపినా ఇంతవరకూ కేసులేదు. కేసు లేకపోవడం మాత్రమే కాదు, పదిహేను రోజుల తర్వాత మృతదేహాలను ఢిల్లీ అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థకు తీసుకువచ్చి ‘వారి కన్నెపొర చిరగలేదు, కనుక అత్యాచారం జరగలేదు’ అని దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన మహాఘనత వహించిన పాలకుల పాలన మనది. విశాఖపట్నం జిల్లా వాకపల్లిలో గ్రే హౌండ్స్ పోలీసులు ఆదివాసి గూడెంపై దాడి చేసి పదకొండు మంది మహిళలపై సామూహిక అత్యాచారం జరిపితే, రాష్ట్రమంతా గగ్గోలెత్తినా కేసు లేదు. నాలుగు సంవత్సరాల పాటు హైకోర్టుదాకా పోరాడితే గాని స్థానిక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలనే ఆదేశం రాలేదు. ఇటువంటి అత్యాచార ఘటనలు, వాటి నేరస్తులు, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి చరిత్ర ఎంత చెప్పినా తరగదు.</p>
  211. <p style="text-align:justify;">ఈ పూర్వరంగంలో, ప్రస్తుతం వినబడుతున్న ప్రతీకార, శిక్షా నినాదాలు ప్రతి అత్యాచారం సందర్భంలోనూ వెల్లువెత్తుతున్నాయా, లేక కొన్ని అత్యాచారాలకు మాత్రమే ఆ శక్తి ఉందా అని ఆలోచించవలసి ఉంది. ఇవాళ వెల్లువెత్తిన స్పందన చాల అవసరమైనదే. సహజమైనదే. న్యాయమైనదే. అది మన వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న ఆర్ద్ర, మానవీయ భావనలకు అద్దంపట్టింది. కాని అది సరిపోదు. అది ఇంకా విస్తృతం కావాలి. అది ఇంకా లోతు పెరగాలి. అది కేవలం శిక్ష దగ్గర ఆగిపోగూడదు. సామాజిక శిక్షణ గురించి ఆలోచించాలి. సామాజిక నిర్మాణం గురించి ఆలోచించాలి. ఈ వ్యవస్థలో జరుగుతున్న ప్రతి అన్యాయం గురించీ, ప్రతి దుర్మార్గం గురించీ అటువంటి స్పందన రావాలి. అది సంఘటితం కావాలి. నిర్మాణయుతం కావాలి. ఇంకా బలోపేతం కావాలి. ఇంకా సమగ్రంగా, దీర్ఘకాలికంగా, మానవీయంగా సాగాలి. అప్పుడే ఒక్క నిర్భయకు కాదు, వేలాది మంది అనామక, అజ్ఞాత నిర్భయలకు నిజమైన నివాళి అవుతుంది.</p>
  212. ]]></content:encoded>
  213. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2013/01/03/%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95-%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/feed/</wfw:commentRss>
  214. <slash:comments>2</slash:comments>
  215. <georss:point>0.000000 0.000000</georss:point>
  216. <geo:lat>0.000000</geo:lat>
  217. <geo:long>0.000000</geo:long>
  218. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  219. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  220. </media:content>
  221. </item>
  222. <item>
  223. <title>2012 in review</title>
  224. <link>https://kadalitaraga.wordpress.com/2013/01/01/2012-in-review/</link>
  225. <comments>https://kadalitaraga.wordpress.com/2013/01/01/2012-in-review/#respond</comments>
  226. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  227. <pubDate>Tue, 01 Jan 2013 12:06:44 +0000</pubDate>
  228. <category><![CDATA[Telugu]]></category>
  229. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=831</guid>
  230.  
  231. <description><![CDATA[The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog. Here&#8217;s an excerpt: 600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 6,000 views in 2012. If every person who reached the &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2013/01/01/2012-in-review/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  232. <content:encoded><![CDATA[<p>The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.</p>
  233. <p> <a href="https://kadalitaraga.wordpress.com/2012/annual-report/"><img src="https://i0.wp.com/www.wordpress.com/wp-content/mu-plugins/annual-reports/img/2012-emailteaser.png" width="100%" alt="" /></a></p>
  234. <p>Here&#8217;s an excerpt:</p>
  235. <blockquote>
  236. <p>600 people reached the top of Mt. Everest in 2012.  This blog got about <strong>6,000</strong> views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 10 years to get that many views.</p>
  237. </blockquote>
  238. <p><a href="https://kadalitaraga.wordpress.com/2012/annual-report/">Click here to see the complete report.</a></p>
  239. ]]></content:encoded>
  240. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2013/01/01/2012-in-review/feed/</wfw:commentRss>
  241. <slash:comments>0</slash:comments>
  242. <georss:point>0.000000 0.000000</georss:point>
  243. <geo:lat>0.000000</geo:lat>
  244. <geo:long>0.000000</geo:long>
  245. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  246. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  247. </media:content>
  248.  
  249. <media:content url="http://www.wordpress.com/wp-content/mu-plugins/annual-reports/img/2012-emailteaser.png" medium="image" />
  250. </item>
  251. <item>
  252. <title>నేపాల్ మావోయిస్టుల దారి ఎటు?</title>
  253. <link>https://kadalitaraga.wordpress.com/2012/12/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/</link>
  254. <comments>https://kadalitaraga.wordpress.com/2012/12/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/#comments</comments>
  255. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  256. <pubDate>Mon, 24 Dec 2012 23:40:50 +0000</pubDate>
  257. <category><![CDATA[వ్యాసాలు]]></category>
  258. <category><![CDATA[Veekshanam]]></category>
  259. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=828</guid>
  260.  
  261. <description><![CDATA[వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2012/12/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  262. <content:encoded><![CDATA[<p style="text-align:left;" align="center"><span style="text-decoration:underline;">వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం</span></p>
  263. <p>పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో ఇరవై ఒకటో శతాబ్ది విప్లవాలకు ‘ప్రచండ మార్గం’ దారి చూపుతుందని ఆశించారు. నాలుగు దశాబ్దాల సాయుధ పోరాటం తర్వాత కూడ విజయానికి చేరువ కాలేకపోయిన భారత విప్లవోద్యమం నేపాల్ నుంచి నేర్చుకోవలసి ఉంటుందని అన్నారు, అనుకున్నారు.<span id="more-828"></span> సాయుధ పోరాటాన్ని 2006లో విరమించి ఖాట్మండులో ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాలలో ప్రచండ, నేపాల్ మావోయిస్టు పార్టీ వేసిన పిల్లిమొగ్గలను కూడ కొందరైనా ఆ దృష్టితోనే సమర్థించారు. వారిని అప్పుడే కొట్టివేయగూడదని, మరికొంత వేచి చూడాలని అన్నారు. కాని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణ కింద ఆయుధాల అప్పగింత, ప్రజాసైన్యాన్ని బారక్ లకు పరిమితం చేయడం, చివరికి ప్రజాసైన్యం ఉపసంహరణ, అధికారం కోసం అవకాశవాద ఎత్తుగడలు, రాజ్యాంగ రచనలో రాజీలు, విప్లవక్రమంలో స్వాధీనం చేసుకుని పేదలకు పంచిన భూములు, ఆస్తులు వెనక్కి ఇవ్వడం, వగైరా ఒక్కొక్క చర్యా ప్రచండ మార్గపు దివాళాకోరుతనాన్ని ఎత్తిచూపింది. ఆ దిశలో ఇప్పుడు రెండు తాజాపరిణామాలు జరిగాయి.</p>
  264. <p><b>పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం</b></p>
  265. <p>నేపాల్ పశ్చిమ కొసన హిమాలయ పర్వత సానువుల మధ్య అన్నపూర్ణ శిఖరానికి దగ్గరలో పోఖరా అనే పట్టణం ఉంది. అది ఖాట్మండు తర్వాత అతి పెద్ద పర్యాటక కేంద్రం. దాదాపు ఆరు దశాబ్దాలుగా అక్కడ ఒక చిన్న విమానాశ్రయం ఉంది. అక్కడికి వచ్చే విదేశీ యాత్రికుల సౌకర్యార్థం అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన కూడ నేపాల్ పర్యాటక విమానయాన సంస్థకు చాల కాలంగా ఉంది. ఆ విమానాశ్రయం నిర్మించడానికి నేపాల్ ప్రభుత్వం ఏడాది కింద 2011 సెప్టెంబర్ 20న చైనా ప్రభుత్వ సంస్థ అయిన చైనా సిఎఎంసి ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు నేపాల్ పార్లమెంటులోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ఈ ఒప్పందాన్ని తప్పు పడుతున్నది. అందుకు అక్కడి రాజకీయ సమీకరణాలు, సంక్షోభం ఒక కారణం కావచ్చు గాని, పిఎసి చూపుతున్న ఆర్థిక కుంభకోణం కారణం పూర్తిగా కొట్టిపారేయదగినదేమీ కాదు. గతంలో నేపాల్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణ వ్యయం 180 మిలియన్ డాలర్లు అని అంచనా వేయగా, ఈ ఒప్పందం మాత్రం 70 శాతం ఎక్కువగా 305 మిలియన్ డాలర్లకు కుదిరిందని పిఎసి అభ్యంతర పెట్టింది. నేపాలీ కరెన్సీలో చెపితే ఇది రు. 1600 కోట్ల రూపాయల తొలి అంచనా నుంచి రు. 2700 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ నిర్మాణానికి అవసరమైన నిధులను నేపాల్ ప్రభుత్వం చైనాకే చెందిన ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి రుణంగా తీసుకుంటున్నది. ఇంత పెద్దఎత్తున నిర్మాణ వ్యయం పెంచి చూపడానికి కారణం ముడుపులు చేతులు మారడమేనని నేపాల్ లో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందం కుదరడానికి మావోయిస్టు అధినేత ప్రచండకు, ఆర్థిక మంత్రి బర్సా మాన్ పున్ కు, ప్రధానమంత్రి బాబూరామ్ భట్టరాయ్ సతీమణి హిసిలా యామి కి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టుల అవినీతి పెచ్చరిల్లుతున్నదని, ప్రచండ ఇప్పటికే పదిహేడు వందల కోట్ల రూపాయలు వెనకేశాడని, పోఖరా విమానాశ్రయ కాంట్రాక్టులో తమకు యాభై లక్షల రూపాయలు ముట్టాయని మావోయిస్టులే స్వయంగా ఒప్పుకున్నారని ప్రతిపక్ష యుఎంఎల్ కు చెందిన మాధవ్ కుమార్ నేపాల్ అన్నాడు. ఈ వార్తను భారత బడా పెట్టుబడిదారీ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్దఎత్తున ప్రచారం చేయడంతో ఇదంతా నేపాల్ కు, చైనా కు వ్యతిరేకంగా భారత-అనుకూల రాజకీయవేత్తలు చేస్తున్న దుష్ప్రచారమేనని ఆ దేశాల అధికార వర్గాలు అంటున్నాయి.</p>
  266. <p><b>గెరిల్లా టూరిజం</b></p>
  267. <p>సాయుధ పోరాటం విరమించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పర్యవేక్షక బృందానికి తమ ఆయుధ గిడ్డంగుల తాళాలు అప్పగించిన తర్వాత ఒక ఒప్పందం కుదిరిందని, తాము సాయుధ పోరాటకాలంలో తిరిగిన అడవుల, కొండల దారుల పటాలను మావోయిస్టు పార్టీ ఆ ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి బృందానికి అప్పగించిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమై ఉండవని, బూర్జువా పత్రికల దుష్ప్రచారం కావచ్చునని అప్పట్లో ప్రచండ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆ వార్తలు నిజమో కాదో గాని, ఇప్పుడు మాత్రం ప్రచండ ప్రపంచంలోనే మొదటిసారిగా ‘గెరిల్లా పర్యాటక మార్గం’ (గెరిల్లా ట్రెక్) పేరుతో తాము గత దశాబ్దంలో తిరిగిన దారుల్లోకి పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. ఈ గెరిల్లా పర్యాటక మార్గం పశ్చిమ, మధ్య నేపాల్ లోని గత ఉద్యమ జిల్లాల మీదుగా సాగుతుంది. ఇది పర్యాటకుల సౌకర్యాన్ని బట్టి 14 రోజులు గాని, 19 రోజులు గాని, 27 రోజులు గాని ఉంటుంది. సాధారణంగా నేపాల్ లోని హిమాలయ పర్వత సానువులలో ఎవరెస్ట్, అన్నపూర్ణ శిఖరాల ప్రాంతానికి, లాంగ్ టాంగ్ ప్రాంతానికి విపరీతంగా విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రాంతాలకు తోడుగా 1996 నుంచి 2006 వరకు సాగిన సాయుధపోరాటంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగిన గ్రామాలను, కొండలను, గుహలను, నదులను, అడవులను, లోయలను కూడ పర్యాటకులు సందర్శించవచ్చు. ఎక్కడెక్కడ మావోయిస్టు గెరిల్లాలు కందకాలు తవ్వారో, ఎక్కడెక్కడ రాజు సైనిక బలగాలతో హోరాహోరీ ఘర్షణలు జరిగాయో అవన్నీ చూడవచ్చు. ఆ ప్రాంతాలలో బస చేయవచ్చు. ఈ పర్యాటక మార్గం గురించి అమెరికన్ యాత్రా రచయిత అలోంజో లయన్స్ తో కలిసి ప్రచండ ఒక పుస్తకం కూడ రాశారు. ఆ పుస్తకాన్ని, యాత్రా మార్గపు పటాన్ని అక్టోబర్ 2న ప్రచండ ఆవిష్కరించారు. విప్లవం నిజంగా విజయం సాధిస్తే ఆ విప్లవ క్రమంలో తాము ఎటువంటి కఠోర పరిస్థితులను అనుభవించారో భవిష్యత్ తరాలకు చెప్పడం అవసరమే కావచ్చు. కాని మధ్యదారిలో వదిలేసిన విప్లవ అనుభవాన్ని ఇలా విహారయాత్రగా మార్చి విదేశీ పర్యాటకులకు అమ్ముకోవడానికి ప్రయత్నించడం, అది కూడ ‘విప్లవం విందు భోజనం కాదు, విహారయాత్ర కాదు’ అని చెప్పిన మావో పేరుతో నడుస్తున్న పార్టీ పేరుమీదనే సాగించడం నిజంగా ప్రచండ మార్గమే.</p>
  268. ]]></content:encoded>
  269. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2012/12/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/feed/</wfw:commentRss>
  270. <slash:comments>1</slash:comments>
  271. <georss:point>0.000000 0.000000</georss:point>
  272. <geo:lat>0.000000</geo:lat>
  273. <geo:long>0.000000</geo:long>
  274. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  275. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  276. </media:content>
  277. </item>
  278. <item>
  279. <title>పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ</title>
  280. <link>https://kadalitaraga.wordpress.com/2012/12/22/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/</link>
  281. <comments>https://kadalitaraga.wordpress.com/2012/12/22/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/#comments</comments>
  282. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  283. <pubDate>Fri, 21 Dec 2012 22:52:31 +0000</pubDate>
  284. <category><![CDATA[వ్యాసాలు]]></category>
  285. <category><![CDATA[Ee Bhoomi]]></category>
  286. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=825</guid>
  287.  
  288. <description><![CDATA[పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2012/12/22/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  289. <content:encoded><![CDATA[<p style="text-align:justify;">పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ వారం రోజుల యుద్ధంలో పాలస్తీనా వైపు మొత్తం మీద 13 మంది స్త్రీలు,  43 మంది పిల్లలతో సహా 173 మంది మరణించారు. 1300 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు ఇద్దరు సైనికులతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. గాజాలో హమస్ వంటి “తీవ్రవాద” సంస్థలు తమ మీద దాడికోసం ఆయుధాలు పోగు వేస్తున్నాయని, ముందస్తు నిరోధక చర్యగా వారి నిర్దిష్ట లక్ష్యాల మీద దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. కాని మృతుల సంఖ్య చూస్తేనే ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఎంత విచ్చలవిడిగా, పౌర, నివాస స్థలాల మీద దాడి జరిపాయో అర్థమవుతుంది.</p>
  290. <p style="text-align:justify;"><span id="more-825"></span></p>
  291. <p style="text-align:justify;">పాలస్తీనీయులు దాడికి సిద్ధపడుతున్నారని తెలిసిందనే అబద్ధం పునాదిగా దాడి చేయడం ఇజ్రాయెల్ కు కొత్త కాదు. అసలు పాలస్తీనాను ఆక్రమించుకుని కూచుని, వారి దేశంలో వారికి పదోవంతుకన్న తక్కువ ప్రాంతం కేటాయించి, వారిని వారి స్వదేశంలోనే శరణార్థులుగా మార్చి, వారి మీద కట్టుకథలు అల్లడం, దుర్మార్గమైన దాడులు చేయడం ఇజ్రాయెల్ కు వెన్నతో పెట్టిన విద్య అయింది. ఇజ్రాయెల్ దుర్మార్గానికి ఎల్లప్పుడూ తోడునీడగా నిలిచే పెద్దన్నలు అమెరికా, బ్రిటన్ లకూ ఇదే అలవాటు. జనవిధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే అబద్ధంతో దాడి చేసి ఇరాక్ ను భస్మీపటలం చేసి, అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను ఉరి కూడ తీసిన అమెరికా ఆ జన విధ్వంసక ఆయుధాల జాడ మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడ గాజాలో ఆయుధ గిడ్డంగులు ఉన్నాయనే అబద్ధంతో 173 మందిని పొట్టన పెట్టుకుంది.</p>
  292. <p style="text-align:justify;">ఇజ్రాయెల్ దాడులు సైనిక స్థావరాల మీద జరగలేదని, స్పష్టంగానే పౌర, నివాస స్థలాల మీద జరిగాయని చెప్పడానికి గాజాలో రెండు మీడియా కేంద్రాల మీద, కనీసం ఆరు వార్తాసంస్థల మీద జరిగిన దాడులు, ఆరుగురు పాత్రికేయులు గాయపడడం నిదర్శనం. హమస్ కు చెందిన టెలివిజన్ కేంద్రం అల్ అఖ్సా, లెబనాన్ కేంద్రంగా నడిచే ప్రసార సంస్థ అల్ ఖుద్స్ టివి కి చెందిన గాజా స్టుడియోల మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది.</p>
  293. <p style="text-align:justify;">ఇజ్రాయెల్ నుంచి గాజా లోని పౌర, నివాస స్థలాల మీద విచ్చలవిడిగా క్షిపణిదాడులు, బాంబుదాడులు సాగుతూ, రోజురోజూ డజన్ల కొద్దీ పిల్లలూ స్త్రీలూ సాధారణ పౌరులూ చనిపోతూ, గాయపడుతూ ఉన్న వార్తలు చదువుతుంటే, ప్రవాసంలో ఉన్న పాలస్తీనియన్ గణితశాస్త్రవేత్త నహీదా రాసిన ‘గాజా గళం’ ఫొటో కవిత కనబడింది. ఆరు దశాబ్దాలుగా తమ నేల నుంచి తాము తొలగించబడి శరణార్థులుగా, బాంబుదాడుల లక్ష్యాలుగా, అనుక్షణ భయంలో, అణచివేతలో, దుఃఖంలో, పోరాటంలో బతుకుతున్న పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాదగాథ కళ్లకు కట్టింది. కళ్ల ముందర జరిగిపోతున్న ఈ మహా దుర్మార్గాన్ని చూస్తూ చూసీ చూడనట్టు నటిస్తూ సభ్య ప్రపంచం ఎంత అసభ్యంగా బతుకుతున్నదో చూసి సిగ్గు కలిగింది. ఆ విషాదగాథ నాకు పరిచయమైన ముప్పై ఏళ్ల వెనుకటి జ్ఞాపకాలు తోసుకొచ్చాయి.</p>
  294. <p style="text-align:justify;">ముప్పై ఏళ్ల కింద, 1982 జూలైలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం. ఎ. ఎంట్రెన్స్ రాయడానికి వెళ్లినప్పుడు, అప్పటికి ఆ విశ్వవిద్యాలయ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న సి వి సుబ్బారావుతో కలిసి క్యాంపస్ కు వెళ్లాను. ఆ క్యాంపస్ లో కలిసిన విద్యార్థులు పాలస్తీనా సమస్య ఏమిటని సుబ్బారావును అడిగారు. అప్పటికి పాలస్తీనా నగరాల మీద ఇజ్రాయెల్ బాంబుదాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ మరణాల వార్తలు వస్తున్నాయి. అక్కడి క్యాంటీన్ లో కూచుని సుబ్బారావు ఆ విద్యార్థులకు పాలస్తీనా విషాదగాథ, ఇజ్రాయెల్ దుర్మార్గ గాథ, ఆ దుర్మార్గానికి ప్రత్యక్షంగా వత్తాసు పలుకుతున్న అమెరికా, బ్రిటన్ ల కుటిల రాజకీయాలు, పరోక్షంగా, మౌనంగా ఆ దుర్మార్గాన్ని ఆమోదిస్తున్న భారత్ వంటి దేశాల అన్యాయం అన్నీ ఓ గంట, రెండు గంటలు వివరించాడు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నాలుగైదు రోజులూ పాలస్తీనా చరిత్ర, రాజకీయాలు, అత్యద్భుతమైన పాలస్తీనా ప్రవాస కవిత్వంతోనే గడిచాయి. ఆ సంభాషణల ఫలితంగానే ఇద్దరమూ కలిసి పాలస్తీనా మీద ఒక వ్యాసం రాశాం. అది 1982 సెప్టెంబర్ సృజనలో అచ్చయింది. ఆ వ్యాసంతో పాటు మూడు పాలస్తీనా కవుల కవితలు కూడ అనువదించాను. ఈ మూడు దశాబ్దాలలో పాలస్తీనా కవితల అనువాదాల్లో, పాలస్తీనా గురించి వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో పాలస్తీనా ప్రజల దీనగాథ, ధీరగాథ నా మనసు మీదినుంచి ఎప్పుడూ చెరిగిపోలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా పాలస్తీనియన్ల ఎడతెగని ఆరాట పోరాటాలు నన్ను కదిలిస్తూనే ఉన్నాయి.</p>
  295. <p style="text-align:justify;">నహీదా తన కవితలో ‘ఇక్కడ/ నేనూ/ అయ్యో! నా దిక్కులేని చిన్నారి పిల్లలూ/ చచ్చిపోతుంటే/ నీ మౌనం చాలిక&#8230;/ మానవత్వమా నువ్వెక్కడ’ అని ప్రశ్నించింది. నిజంగానే కళ్ల ముందర జరిగిపోతున్న మహా విధ్వంసం గురించి, అమానుష మారణ కాండల గురించి, దుర్మార్గమైన, దౌర్జన్యపూరితమైన ఆక్రమణ గురించి మానవాళి మౌనం వహిస్తోంది. మానవత్వానికి తామే చిరునామా అని వీరాలాపాలు పలికేవాళ్లందరూ ఆరు దశాబ్దాలుగా, వేలాది మంది చిన్నారి పిల్లల ప్రాణాల సాక్షిగా, లక్షలాది మంది శరణార్థుల కడగండ్ల సాక్షిగా మౌనం వహిస్తున్నారు. తమ మౌనంతో హంతకులకు అవకాశమిస్తున్నారు.</p>
  296. <p style="text-align:justify;">పాలస్తీనా పశ్చిమాసియాలో మధ్యధరా సముద్రానికీ జోర్డాన్ నదికీ మధ్య ఉన్న భూభాగం. పాలస్తీనియన్లు అరబ్బులలో భాగమైన ఒక జాతి. చరిత్రలో పాలస్తీనా ప్రస్తావనలు కనీసం రెండువేల ఐదు వందల ఏళ్లుగా ఉన్నాయి. దీనిలో అత్యధిక భాగం గాని, విడివిడి భాగాలుగా గాని పందొమ్మిదో శతాబ్దం వరకూ అనేక సామ్రాజ్యాలలో భాగంగా ఉన్నాయి. జూడాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బహాయి వంటి మతాలన్నిటికీ ప్రధానమైన కేంద్రాలు ఈ భూభాగంలోనే ఉన్నందువల్ల ఆయా మతాల ప్రజలందరికీ ఈ ప్రాంతం తమకే చెందాలన్న ఆకాంక్షలున్నాయి. దానితో పాటు పశ్చిమాసియాలో, చమురు ఉత్పాదక గల్ఫ్ దేశాలకు పొరుగున ఉండడం వల్ల కూడ ఈ ప్రాంతపు ప్రాధాన్యత పెరిగిపోయింది.</p>
  297. <p style="text-align:justify;">పందొమ్మిదో శతాబ్దం మధ్యలో ఈ భూభాగాన్ని టర్కిష్ ఆటోమన్ సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ కైవసం చేసుకుంది. కొద్ది సంవత్సరాలలోనే బ్రిటన్ జోక్యం చేసుకుని ఈ ప్రాంతాన్ని మళ్లీ ఆటోమన్ సామ్రాజ్యంలో చేర్చింది గాని అది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్య ప్రభావంలోనే ఉండింది.</p>
  298. <p style="text-align:justify;">ఈ లోగా 1897లో థియొడర్ హెర్జెల్ అనే యూదు సిద్ధాంత కర్త జియోనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ సిద్ధాంతం బైబిల్ లోని బుక్ ఆఫ్ జెనెసిస్ లో ఈ ప్రాంతాన్ని అబ్రహాం వారసులకు ఇస్తున్నట్టుగా భగవంతుడు చెప్పాడని, దానిపేరు ఇజ్రాయెల్ అని, తాము అబ్రహాం వారసులమని, అందువల్ల ఇది తమకు చెందాలని వాదించడం మొదలుపెట్టింది. ఈ జియోనిజం ప్రారంభకులూ, సమర్థకులూ ప్రధానంగా యూదులు. వడ్డీ వ్యాపారులుగా, వర్తకులుగా, సంపన్నులుగా యూదుల పట్ల అప్పటికి మూడు నాలుగు వందల ఏళ్లుగా యూరప్ లో ఉండిన వ్యతిరేక భావనల వల్ల యూదులను ఏకం చేసి, వారికే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచడం జియోనిజం లక్ష్యం. ఇది భగవంతుడి ఆదేశంగా మాత్రమే కాక, “భూమిలేని ప్రజలకు, ప్రజలు లేని భూమి” అనే నినాదాన్ని కూడ తీసుకుంది. కాని పాలస్తీనా ప్రజలు లేని భూమి కాదు, అక్కడ నిండా అరబ్బులు ఉన్నారు.</p>
  299. <p style="text-align:justify;">మత విశ్వాసాల ప్రకారం పాలస్తీనా జనాభా అప్పటికి పూర్తిగా ముస్లింలు కాగా ఇది యూదు – ముస్లిం మత వైరంగా కూడ బలపడింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా ఈ తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలని అంటూ భారీ వలసలను ఈ జియోనిజం ప్రోత్సహించింది. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో వెలువడిన బాల్ ఫోర్ డిక్లరేషన్ తో ఈ నినాదం ప్రచారంలోకి రాగా బ్రిటన్ ఈ జియోనిస్టు వలసలను పూర్తిగా సమర్థించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి పాలస్తీనా భూభాగమంతా బ్రిటన్ చేజిక్కింది. పాలస్తీనీయులు బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేవరకూ పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది.</p>
  300. <p style="text-align:justify;">చివరికి 1947లో పాలస్తీనా మీద తన అధికారం వదులుకుంటున్నానని ప్రకటించిన బ్రిటన్, అప్పటికే బలపడిన అమెరికాలు ఐక్యరాజ్యసమితి చేత ఒక తీర్మానం చేయించాయి. ఆ తీర్మానం ప్రకారం పాలస్తీనాను మూడు భాగాలుగా విడగొట్టారు. ఒకటి అరబ్ రాజ్యం, ఒకటి యూదుల రాజ్యం. మరొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలెం నగరం. అరబ్బుల నేలలో ఉన్న, తనకు అత్యంత అవసరమైన చమురు కోసం వారితో తనకు ఎప్పటికైనా ఘర్షణ తప్పదని, విభిన్న మతవిశ్వాసాల వల్ల ఆ ఘర్షణ సమసిపోవడం సాధ్యం కాదని గుర్తించిన అమెరికా అరబ్బు దేశాల పక్కలో బల్లెంలా ఇజ్రాయెల్ ను తయారుచేసి, దాన్ని తన కీలుబొమ్మగా మార్చుకోవాలని చేసిన దురాలోచన ఫలితమే యూదుల రాజ్యంగా ఇజ్రాయెల్ ఏర్పాటు.</p>
  301. <p style="text-align:justify;">ఈ విభజనను వ్యతిరేకించిన అరబ్బులు యుద్ధం ప్రారంభించారు. అయినా ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం మాత్రమే కాదు, ఐరాస తీర్మానంలో లేని మరొక 26 శాతం భూభాగం మీద కూడ ఇజ్రాయెల్ తన పాలన స్థాపించుకుంది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన ఏడు లక్షల మంది పాలస్తీనీయులు శాశ్వతంగా శరణార్థులయిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనాలో కొంత భాగం జోర్డాన్ చేతికీ, కొంత భాగం ఈజిప్ట్ చేతికీ వెళ్లాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో ఈ రెండు దేశాల నుంచి పాలస్తీనా భాభాగాల్ని ఇజ్రాయెల్ కైవసం చేసుకుంది.</p>
  302. <p style="text-align:justify;">రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో, ముఖ్యంగా యూరప్ లో నాజీ హిట్లర్ అత్యాచారాలకు బలి అయిన యూదులు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వలస రావడం ప్రారంభించారు. నిజానికి హిట్లర్ దుర్మార్గాలను తప్పించుకోవడానికి వలస వచ్చిన ఈ శరణార్థుల వలసలను మానవతా దృష్టితో సమర్థించవలసిందే గాని, వారు పాలస్తీనాలో స్థానికులను తోసివేసి, స్థానికుల భూమిని ఆక్రమించుకుని, వారినే శరణార్థులుగా మార్చివేశారు.</p>
  303. <p style="text-align:justify;">పాలస్తీనాను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పరచాలనే లక్ష్యంతో 1964లో ఏర్పడిన పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) యాసర్ అరాఫత్ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాదరాలు సంపాదించుకుంది. వంద దేశాలు పి ఎల్ ఒ ను గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి పిఎల్ ఒ ను గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు మాత్రం దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ రాజకీయ, అర్థ సైనిక జాతీయ విమోచనా సంస్థ పాలస్తీనా విముక్తి కోసం రాజకీయ, దౌత్యపరమైన పోరాటం చేస్తూనే సాయుధ పోరాటాన్ని కూడ చేపట్టింది. ఆ సాయుధ పోరాటాలు అనేక మలుపులు తిరిగాయి.</p>
  304. <p style="text-align:justify;">ఐక్య  రాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ కు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతుగా జరిగిన తీర్మానాలకు లెక్కలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చేసరికి అమెరికా, బ్రిటన్ లు వీటో ప్రకటించి అడ్డుకునేవి. సుదీర్ఘకాలం ఘర్షణల తర్వాత 1993లో పి ఎల్ ఒ కు ఇజ్రాయెల్ కు మధ్య నార్వే లోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. పి ఎల్ ఒ సాయుధ పోరాటాన్ని విరమించి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనీయులకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంక్ లో, జెరికోలో పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే ఒక దేశపు పౌరులను అణచివేసి, నిర్వాసితులను చేసి, వారి మీద నాలుగు దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి, చివరికి వారి దేశంలో పదో వంతు భూభాగం మీద వారికి పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ పి ఎల్ ఒ నాయకత్వాన మరొక సాయుధ పోరాటం జరగడంతోపాటు పి ఎల్ ఒ రాజీని వ్యతిరేకించే సంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. అటువంటి సంస్థలలో ఒకటైన హమస్ గాజా నగరంలో అధికారానికి కూడ వచ్చింది.</p>
  305. <p style="text-align:justify;">ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి, తమ నేల మీద తమ పాలన నడుపుకుంటున్న హమస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, పాలస్తీనియన్లకు మిగిలిన ఆ నేలచెక్కను కూడ కబళించడానికి, పాలస్తీనియన్లను బెదిరించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర కుటిల ప్రయత్నాలలో భాగమే తాజా బాంబుదాడులు.</p>
  306. <p> <img data-attachment-id="826" data-permalink="https://kadalitaraga.wordpress.com/2012/12/22/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/palestine/" data-orig-file="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg" data-orig-size="400,287" data-comments-opened="1" data-image-meta="{&quot;aperture&quot;:&quot;0&quot;,&quot;credit&quot;:&quot;&quot;,&quot;camera&quot;:&quot;&quot;,&quot;caption&quot;:&quot;&quot;,&quot;created_timestamp&quot;:&quot;0&quot;,&quot;copyright&quot;:&quot;&quot;,&quot;focal_length&quot;:&quot;0&quot;,&quot;iso&quot;:&quot;0&quot;,&quot;shutter_speed&quot;:&quot;0&quot;,&quot;title&quot;:&quot;&quot;}" data-image-title="Palestine" data-image-description="" data-image-caption="" data-medium-file="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=300" data-large-file="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=400" class="size-medium wp-image-826 aligncenter" alt="Palestine" src="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=300" width="300" height="215" srcset="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=300 300w, https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=150 150w, https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg 400w" sizes="(max-width: 300px) 100vw, 300px" /></p>
  307. <p style="text-align:justify;">
  308. <p style="text-align:justify;">భారత ప్రభుత్వానికి 1960లలో, 70లలో అలీనోద్యమంలో భాగంగా పాలస్తీనా ప్రజాపోరాటాన్ని సమర్థించిన ఘనచరిత్ర ఉండేది. కాని 1980ల మధ్య నుంచి అమెరికా కనుసన్నలలో నడవడం ప్రారంభించిన భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజా ఆకాంక్షలకు ద్రోహం చేయడం తలపెట్టింది. చివరికి నిన్నా మొన్నా గాజా నెత్తురోడుతుంటే భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ “అవసరమైన దానికంటే ఎక్కువ బలప్రయోగం చేస్తున్నందుకు” మాత్రం అభ్యంతరం తెలిపారు. అవసరమైనంత బలప్రయోగం అంటే ఏమిటో, అది చేస్తే ఫరవాలేదని భారత ప్రభుత్వ అభిప్రాయమేమో తెలియదు. కాకపోతే కన్నీటి తుడుపు లాగ జెరూసలెం రాజధానిగా సంపూర్ణ, స్వతంత్ర, సార్వభౌమాధికార పాలస్తీనా ఏర్పడాలని భారత ప్రభుత్వం కోరుతున్నదని ఒక సన్నాయి నొక్కు నొక్కారు. అందుకోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రం అక్షరం కూడ లేదు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు, ఒకప్పుడు పాలస్తీనా ప్రజా పోరాటాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించిన భారత ప్రజాభిప్రాయం కూడ ఇటీవలికాలంలో వినబడవలసినంత బలంగా వినబడడం లేదు.</p>
  309. <p style="text-align:justify;">అంతేనా? ఇంకా దుడ్డున్నవాడిదే బర్రె అనే విలువలేనా? న్యాయం అన్యాయం అనేవేమీ లేవా? ప్రజాస్వామ్యం, నాగరికత, మాతృభూమి, స్వదేశం, విదేశీ దురాక్రమణను ఎదిరించడం అనే విలువలన్నీ బోలుసరుకేనా? ఈ అమెరికా సర్వంసహాధికార ప్రపంచంలో రేపు భారత దేశాన్ని ఆక్రమించినా మాట్లాడేవారెవరూ ఉండరా?</p>
  310. <p style="text-align:justify;">
  311. <p style="text-align:justify;" align="right">
  312. <p style="text-align:center;" align="center"><b>Box</b></p>
  313. <p style="text-align:center;" align="center"><b>విషాదగాథలో కొన్ని మైలురాళ్లు</b></p>
  314. <p style="text-align:justify;">1914: టర్కీ (ఆటోమన్ సామ్రాజ్యం) లో భాగమైన పాలస్తీనా జనాభాలో అరబ్బులు ఐదు లక్షల మంది (87 శాతం), యూరప్ నుంచి వలస వచ్చిన యూదులు 65,000 (13 శాతం) ఉండేవారు.</p>
  315. <p style="text-align:justify;">1917: బ్రిటిష్ విదేశాంగ మంత్రి బాల్ ఫోర్ యూదు ప్రజల జాతీయ మాతృభూమిగా పాలస్తీనాను ఇస్తామని ప్రకటించాడు.</p>
  316. <p style="text-align:justify;">1918: మొదటి ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనా పాలనాధికారం బ్రిటన్ చేతికి చిక్కింది.</p>
  317. <p style="text-align:justify;">1922-39: యూరప్ లోని అన్ని దేశాల నుంచి మూడు లక్షల మంది యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు. అరబ్బులకూ యూదులకూ మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం అరబ్బుల ప్రతిఘటనను అణచివేసింది.</p>
  318. <p style="text-align:justify;">1947-48: పాలస్తీనానుంచి బ్రిటన్ వైదొలగింది. 1948 మే 15న ఇజ్రాయెల్ దేశం స్థాపనను ప్రకటించారు. అరబ్బుల ప్రతిఘటనను ఇజ్రాయెల్ సైన్యం అణచివేసింది. లక్షలాది మంది పాలస్తీనీయులు పొరుగుదేశాలకు తరలివెళ్లారు.</p>
  319. <p style="text-align:justify;">1964: పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) ఏర్పాటు. 1969లో యాసర్ అరాఫత్ నాయకత్వంలోని అల్ ఫతా చేతుల్లోకి వచ్చిన పి ఎల్ ఒ.</p>
  320. <p style="text-align:justify;">1967: ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాలపై దాడి చేసి ఈజిప్ట్ నుంచి సినాయి ని, సిరియా నుంచి గోలన్ హైట్స్ ను, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, జెరూసలెంలను ఆక్రమించుకుంది.</p>
  321. <p style="text-align:justify;">1973: సిరియా, ఈజిప్ట్ లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగాయి.</p>
  322. <p style="text-align:justify;">1978: ఈజిప్ట్, ఇజ్రాయిల్ ల మధ్య కుదిరిన కాంప్ డేవిడ్ ఒప్పందం.</p>
  323. <p style="text-align:justify;">1982: ఇజ్రాయెల్ లెబనాన్ ను ఆక్రమించి పి ఎల్ ఒ ను బహిష్కరించింది. బీరుట్లో పాలస్తీనా శరణార్థి శిబిరాల మీద దాడి చేసి వందలాది మంది పాలస్తీనియన్లను ఊచకోత కోసింది.</p>
  324. <p style="text-align:justify;">1980: దశాబ్దం పొడవునా వెస్ట్ బ్యాంక్ లో యూదుల స్థిర నివాసాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్.</p>
  325. <p style="text-align:justify;">1987: వెస్ట్ బ్యాంక్, గాజాలలో సాయుధపోరాటం ప్రారంభించిన పాలస్తీనియన్లు.</p>
  326. <p style="text-align:justify;">1993: ఇజ్రాయెల్ కు, పి ఎల్ ఒ కు మధ్య ఓస్లోలో కుదిరిన ఒప్పందం. పాలస్తీనాకు పరిమిత స్వీయ పాలనాధికారం.</p>
  327. <p style="text-align:justify;">2000: వెస్ట్ బ్యాంక్ లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్. రెండో సాయుధ పోరాటం ప్రారంభం.</p>
  328. <p style="text-align:justify;">2004: నలభై లక్షల మంది పాలస్తీనియన్లు సిరియా, లెబనాన్, జోర్డాన్లలో తలదాచుకున్నారని, వెస్ట్ బ్యాంక్, గాజాలలో నిత్య భయంలో ఉన్నారని అంచనా.</p>
  329. <p style="text-align:justify;">2005: గాజా నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ. ఎన్నికల్లో హమస్ గెలుపు.</p>
  330. ]]></content:encoded>
  331. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2012/12/22/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/feed/</wfw:commentRss>
  332. <slash:comments>1</slash:comments>
  333. <georss:point>0.000000 0.000000</georss:point>
  334. <geo:lat>0.000000</geo:lat>
  335. <geo:long>0.000000</geo:long>
  336. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  337. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  338. </media:content>
  339.  
  340. <media:content url="https://kadalitaraga.files.wordpress.com/2012/12/palestine.jpg?w=300" medium="image">
  341. <media:title type="html">Palestine</media:title>
  342. </media:content>
  343. </item>
  344. <item>
  345. <title>ఒబామా గెలుపు ఎవరికి మేలు?</title>
  346. <link>https://kadalitaraga.wordpress.com/2012/12/20/%e0%b0%92%e0%b0%ac%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b1%81/</link>
  347. <comments>https://kadalitaraga.wordpress.com/2012/12/20/%e0%b0%92%e0%b0%ac%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b1%81/#respond</comments>
  348. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  349. <pubDate>Thu, 20 Dec 2012 05:00:40 +0000</pubDate>
  350. <category><![CDATA[వ్యాసాలు]]></category>
  351. <category><![CDATA[Veekshanam]]></category>
  352. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=823</guid>
  353.  
  354. <description><![CDATA[వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం. “రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2012/12/20/%e0%b0%92%e0%b0%ac%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b1%81/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  355. <content:encoded><![CDATA[<p style="text-align:justify;"><span style="text-decoration:underline;">వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం</span></p>
  356. <p style="text-align:justify;">అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం.</p>
  357. <p style="text-align:justify;">“రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత అమెరికా అధికార పీఠం మీదికి ఆ సమాజంలోని అతి ముఖ్యభాగానికి చెందిన వ్యక్తికి అవకాశం దొరకడం కొత్తగాలి వీస్తున్నదనడానికి సూచనే. అంతమాత్రమే గాక, తెల్లవారికి, నల్లవారికి మధ్య సమానత్వం ఉండాలని అన్నందుకే ఇద్దరు అధ్యక్షులు హత్యకు గురయిన దేశంలో, ఒక నల్లజాతి వ్యక్తి ఎన్నికల ద్వారా అధ్యక్ష పదవికి రావడం కూడ ఆహ్వానించవలసిన సంగతే. అమెరికా సమాజంలో వ్యక్తీకరణ పొందుతున్న కొత్త తరం ఆలోచనలకు, ప్రజాస్వామిక ధోరణులకు ఒబామా ఎన్నిక ఒక సూచనే.<span id="more-823"></span> అయితే అమెరికన్ సమాజంలోని కొత్తధోరణులు తనమీద పెట్టిన ఈ నమ్మకాన్ని ఒబామా నిలుపుకోగలడా అనే అనుమానాన్ని అమెరికన్ సమాజంలోని ప్రగతిశీల శక్తులన్నీ వ్యక్తంచేస్తున్నాయి. అమెరికన్ పాలకవర్గాలలో ఒక ముఠా కోరికలమేరకు, ఆ ముఠా ఆర్థికసహాయంతో అధికారపగ్గాలు చేపట్టిన ఒబామా ఆ వర్గపు ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించగలడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ముఠా ప్రయోజనాలు రిపబ్లికన్ పార్టీ ప్రయోజనాలకన్న, జార్జి బుష్ ప్రయోజనాలకన్న భిన్నమైనవేమీ కావు. వాళ్ల నినాదాలు వేరు కావచ్చుగాని, పశ్చిమాసియా చమురు నిల్వల విషయంలో, ఇజ్రాయిల్ పాలకులను సమర్థించే విషయంలో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అమెరికన్ యుద్ధస్థావరాల విషయంలో, అఫ్ఘనిస్తాన్, ఇరాక్ లతో యుద్ధం విషయంలో, ప్రపంచీకరణ రాజకీయార్థిక విధానాల విషయంలో, ప్రపంచాన్ని బహుళజాతిసంస్థల దోపిడీ పీడనలకు అనుకూలంగా తయారుచేసిపెట్టే విషయంలో వాళ్ల ఆలోచనలు ఒకటే. అమెరికన్ ఆంతరంగిక రాజకీయార్థిక విధానాలలో ఏ స్వల్పమైన మార్పులనో ఒబామా తీసుకు రాగలడేమోగాని, అమెరికన్ విదేశాంగనీతినీ, అంతర్జాతీయ రాజకీయార్థిక వ్యవహారాలలో అమెరికా పాలకులు నిర్వహిస్తున్న దౌర్జన్య, దోపిడీ విధానాలనూ మార్చగలడా అనే ప్రశ్న వేయవలసినదే. మార్చజాలడనే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు” అని నాలుగేళ్ల కింద వీక్షణం రాసిన వ్యాఖ్యలో అక్షరం కూడ మార్చవలసిన అవసరాన్ని ఒబా        మా కల్పించలేదు.</p>
  358. <p style="text-align:justify;">గెలుస్తాడా, ఓడుతాడా అని చివరి నిమిషం దాకా ఉత్కంఠకు గురి చేసి ఒబామా చివరికి రెండోసారి గెలిచి మరొక నాలుగేళ్ల కొరకు అమెరికా అధ్యక్షుడయ్యాడు. శ్వేత జాత్యహంకారానికీ, నల్లజాతి పట్ల వివక్షకూ పేరుపొందిన అమెరికాలో నల్లజాతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు కావడమే విశేషం గనుక మొదటిసారి 2008 ఎన్నికలలో ఒబామా ఎన్నికను చాలమంది విమర్శనాత్మకంగా అయినా ఆహ్వానించారు. అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా సామ్రాజ్యవాద, బహుళజాతి సంస్థల చేతుల్లోనే ఉంటుంది గనుక అది మారకపోవచ్చునని, కాని నల్లజాతి వ్యక్తిగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కనీసం దేశ అంతర్గత విధానాలలో ఒబామా పాలన కొంత ప్రగతిశీలంగా ఉండవచ్చునని కొందరు ఆశించారు. ఒబామా నాలుగు సంవత్సరాల పాలన ఆ ఆశలన్నిటినీ వమ్ము చేసింది.</p>
  359. <p style="text-align:justify;">ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాద రాజకీయాలను కొనసాగించడం, నాటో దళాలతో కలిసి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో సైన్యాలను తిష్టవేయించి, దుర్మార్గమైన దాడులు కొనసాగించడం, చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాల మీద కయ్యానికి కాలు దువ్వడం, అక్కడి ప్రజాందోళనలకు, కుట్రలకు సహకరించడం, లిబియా మీద దాడి చేయడం, గల్ఫ్ దేశాలకు పక్కలో బల్లెంలా అమెరికన్ పాలకవర్గాలు తయారు చేసిపెట్టిన ఇజ్రాయెల్ ను కనీసంగానైనా అదుపు చేయకపోవడం వంటి విధానాలన్నీ ఒబామా పాలనలో యథాతథంగా సాగాయి. వాటిని మౌలికంగా మార్చగలిగిన శక్తి అమెరికా అధ్యక్షుడికి లేకపోవచ్చు. కాని అమెరికా ఆర్థిక వ్యవస్థలోపల పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి ప్రయత్నించడం, సంక్షేమ వ్యయాల మీద కోత విధించకపోవడం, నల్లజాతి, లాటినోలు, ఆసియన్లు, స్త్రీలు వంటి అణగారిన అమెరికన్ వర్గాల పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడం వంటి పనులన్నా ఒబామా నాయకత్వంలోని డెమొక్రటిక్ ప్రభుత్వం చేయగలదని ఆశించినవారికి ఆశాభంగమే మిగిలింది.</p>
  360. <p style="text-align:justify;">ఒబామా వ్యక్తిగతంగా గాని, డెమొక్రటిక్ పార్టీ మొత్తంగా గాని 2008 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ జాబితా తయారుచేసి, వాటిలో నెరవేర్చనివెన్నో రాజకీయ విశ్లేషకుడు మాట్ స్టోలర్ నిర్ధారించారు. ఆ జాబితా ప్రకారం కార్మికులు యూనియన్లలో చేరడాన్ని సులభతరం చేసే ఎంప్లాయీ ఫ్రీ చాయిస్ ఆక్ట్ అనే చట్టం తీసుకువస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. సమ్మె చేసిన కార్మికులను శాశ్వతంగా తొలగించడంపై నిషేధం విధిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికులందరికీ ఏడురోజుల వేతనసహిత అనారోగ్య సెలవులు ఇస్తామమే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఆధారపడిన పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు ఎర్న్ డ్ ఇన్ కమ్ టాక్స్ క్రెడిట్ రాయితీ ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కనీస వేతనాలను పెంచుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తనఖా అప్పులను రద్దు చేసే అధికారం స్థానిక న్యాయాధికారులకు ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమెరికన్ పౌరుల టెలిఫోన్ సంభాషణలను రహస్యంగా, వారంట్ లేకుండా వినడం రద్దు చేస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. దేశంలోని ప్రజాఉద్యమ బృందాల మీద, కార్యకర్తల మీద కేంద్ర ప్రభుత్వ దాడులను ఆపుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. హెబియస్ కార్పస్ హక్కును పునరుద్ధరిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అసలు వీటిని అమలు చేయడంలో విఫలం కావడం కాదు, ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయడానికి చిన్నమెత్తు ప్రయత్నం కూడ ఈ నాలుగేళ్లలో జరగలేదని స్టోలర్ వ్యాఖ్యానించారు.</p>
  361. <p style="text-align:justify;">“వీటిని కేవలం వాగ్దానాల ఉల్లంఘనలుగా మాత్రమే చూడగూడదు. ఇవి అణగారిన ప్రజల ఆర్థిక రాజకీయ హక్కుల ఉల్లంఘనలు. వ్యక్తిగత అంశాలు, యూనియన్ హక్కులు, రుణగ్రహీతల హక్కులు, క్రియాశీల కార్యకర్తల హక్కులు వంటివన్నీ వాగ్దానాలలో ఉన్నాయి గాని ఏ ఒక్కటీ అమలులోకి మాత్రం రాలేదు. ఇందుకు భిన్నంగా, బడా వ్యాపారవేత్తల, బ్యాంకుల, మొత్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదపు సేవలో, వారికోసం మాత్రం ఒబామా ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేసింది. భారీ బ్యాంకులను రక్షించడానికి, వాల్ స్ట్రీట్ సహాయార్థం లక్షల కోట్ల డాలర్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాన్ని కొనసాగించింది. లిబియా, పాకిస్తాన్, యెమెన్, తదితర ప్రాంతాలకూ సైనిక చర్యలను విస్తరించింది. చివరికి ఒబామా తెచ్చిన కొత్త ఆరోగ్య రక్షణ చట్టంలో కొన్ని అనుకూల అంశాలున్నప్పటికీ, వాటికన్న ఎక్కువగా కొన్ని నిబంధనలు లక్షలాది ప్రజలను బీమా కంపెనీల లాభార్జనా పథకాల వలలోకి నెట్టివేసేలా ఉన్నాయి” అని ఆయన రాశారు.</p>
  362. <p style="text-align:justify;">ఇది వ్యక్తిగత సమస్య కాదు. బారక్ ఒబామా అనే వ్యక్తి నల్లజాతికి చెందినవాడిగా వివక్ష, అవమానం, పేదరికం, కష్టాలు తెలిసినవాడే కావచ్చు. కాని ఆ పుట్టుక మాత్రమే ఆయన విధానాలను నిర్ణయించదు. వర్గ సమాజంలో అధికార పీఠం ఎక్కేవారు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ భావజాలంతో, విలువలతో ఉన్నారు అనేదే ప్రధానమవుతుంది, పాలకవర్గంలో చేరిపోయిన వ్యక్తిగా, పాలకవర్గ ప్రతినిధిగా, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా ఒబామా ముందు ఉండే కర్తవ్యం తాను పుట్టిన అస్తిత్వ బృందపు హక్కులను రక్షించడం ఎంతమాత్రం కాదు. ఆ ఆస్తిత్వాన్ని వదిలేసి, లేదా కేవలం ప్రదర్శనావస్తువుగా మాత్రమే ఉంచుకుంటూ, చూపుతూ, వాస్తవంలో మాత్రం పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడం, పెంపొందించడం మాత్రమే ఆయన బాధ్యత. ఆ కర్తవ్యాన్ని ఆయన ఎంతకాలం సమర్థంగా నెరవేర్చగలిగితే అంతకాలం మాత్రమే ఆయనకు ఆ ప్రాతినిధ్య పాత్ర దక్కుతుంది. గత నాలుగేళ్లలో ఆ పని చాల సమర్థంగా చేశాడని రుజువైనందువల్లనే ఆయనకు మరో అవకాశం దక్కింది. అణగారిన ప్రజలను, డెమొక్రటిక్ పార్టీ శ్రేణులను చాలవరకు, ప్రగతిశీల శక్తులను కూడ కొంతవరకు ఆకర్షించడానికి, మోసగించడానికి ఎట్లాగూ వాగ్దానాలు, వాగాడంబరం ఉండనే ఉన్నాయి. అవి చాలవనుకుంటే ఎన్నికల అక్రమాలు కూడ తోడ్పడతాయని వార్తలు, వ్యాఖ్యలు వస్తున్నాయి.</p>
  363. <p style="text-align:justify;">పుట్టుక వల్ల ఒబామా ఏదో ఒరగబెడతాడని సగటు అమెరికన్ పౌరులకు ఆశలున్నాయో లేవో గాని భారతదేశంలో మాత్రం శ్వేతసౌధంలో నల్లకలువ వగైరా విశేషణాలతో 2008 గెలుపు సందర్భంగా చాలా ఆశాభావం వ్యక్తమయింది. అయితే పుట్టుక వల్ల తమ అస్తిత్వ బృందానికి సహాయం చేస్తారనే మాట నిజం కాదని అందరికన్న ఎక్కువగా భారతీయులకు తెలుసు. భారత రాష్ట్రపతి సింహాసనం మీద అణగారిన వర్గాలలో పుట్టినవారందరూ (దళితుడు కె ఆర్ నారాయణన్, ముస్లింలు జాకీర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అబ్దుల్ కలామ్, సిక్కు జైల్ సింగ్, స్త్రీ ప్రతిభా పాటిల్) కూచున్నారు. కాని ఆయా వర్గాల జీవితాల పురోభివృద్ధికి, కనీసం వివక్ష, అత్యాచారాలు ఆపడానికి వారు చేసిన మేలు అణువంత కూడ లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు.</p>
  364. <p style="text-align:justify;">అసలు అమెరికాలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమే కాదని, అందువల్లనే అధ్యక్షుడుగా ఏ పార్టీకి చెందిన ఏ వ్యక్తి ఉంటారనేది ముఖ్యం కాదని ఒబామా గెలుపుకు కొద్ది ముందే వామపక్ష రచయిత రాబర్ట్ మెక్ చెస్నీ ఒక సుదీర్ఘమైన విశ్లేషణా వ్యాసం రాశారు.</p>
  365. <p style="text-align:justify;">‘ప్రస్తుత అమెరికా ఎన్నికల రాజకీయాలలో ఒకవైపు రాజకీయ నాయకులూ మేధావులూ చేసే గంభీరమైన ప్రకటనలున్నాయి. మరొకవైపు తీవ్రమైన, విస్తారమైన, సాధారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్న అమెరికన్ ప్రజానీకపు సమస్యలున్నాయి. ఈ రెంటి మధ్యా అఖాతం నానాటికి పెరిగిపోతున్నది’ అని ఆయన రాశారు. ‘ప్రజలకూ పాలకులకూ మధ్య ఈ దూరానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఏటా సైనికీకరణకూ యుద్ధానికీ ఖర్చవుతున్న లక్ష కోట్ల డాలర్ల నిధుల మీద ఎటువంటి ప్రజాసమీక్ష, చర్చ ఉండడం లేదు. అలాగే ఆర్థిక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద కార్పొరేట్ శక్తుల నియంత్రణ గురించి కూడ ఎక్కడా చర్చకు రావడం లేదు. సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన, వర్గ వ్యవస్థ, పెరిగిపోతున్న పేదరికం, రోజురోజుకూ కునారిల్లుతున్న సామాజిక సేవలు  వంటి అంశాలు రాజకీయవాదుల ఉపన్యాసాలలో, ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రస్తావనకు కూడ రావడం లేదు’ అని మెక్ చెస్నీ అంటున్నారు.</p>
  366. <p style="text-align:justify;">ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికా ప్రభుత్వాలు ఇలా ఎందుకు ప్రజలకు దూరదూరంగా జరిగిపోతూ, ప్రజావ్యతిరేకంగా మారిపోతున్నాయో చర్చిస్తూ ఆయన ‘నిజంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకూ ప్రధాన స్రవంతి రాజకీయాలకూ ఏమీ సంబంధం లేని స్థితి నానాటికీ పెరుగుతున్నది. లేదా, ఇంకా సరిగా చెప్పాలంటే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కల్పిస్తున్న ప్రధాన శక్తి ప్రధానస్రవంతి రాజకీయాలే’ అన్నారు.</p>
  367. <p style="text-align:justify;">‘పెట్టుబడిదారీ విధానానికీ ప్రజాస్వామ్యానికి మధ్య సంబంధం ఎప్పుడూ సమస్యల మయమే. పెట్టుబడిదారీ విధానమేమో దారుణమైన అసమానతను సృష్టిస్తుంది. ప్రజాస్వామ్యమేమో రాజకీయ సమానత్వ భావన మీదనే ఆధారపడుతుంది. కాని రాజకీయ సమానత్వాన్ని ఆర్థిక అసమానత్వం దెబ్బతీసినప్పుడు, తీవ్రమైన ఆర్థిక అసమానతల పరిస్థితులలో ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యమైపోతుంది” అని ఆయన నిర్ధారించారు. “చాల కాలంగా అమెరికాను ‘బలహీన ప్రజాస్వామ్యం’ అని అభివర్ణిస్తున్నారు. కాని కొత్త శతాబ్దపు రెండో దశాబ్దానికల్లా ఆ వర్ణన అతిశయోక్తి అయిపోయింది. ఇవాళ అమెరికా గురించి కచ్చితంగా చెప్పాలంటే అది డాలరోక్రసీ – డాలర్ స్వామ్యం – తప్ప మరేమీ కాదు. అది ప్రజల పాలన కాదు, డబ్బు పాలన. ఇది అమెరికాకే ప్రత్యేకమైన అత్యల్ప సంఖ్యాక సంపన్న ముఠా రాజ్యం. ఎవరి దగ్గర ఎక్కువ డాలర్లుంటే వాళ్లే ఎక్కువ వోట్లు తెచ్చుకుంటారు, వాళ్లే పాలన సాగిస్తారు” అని ఆయన అన్నారు.</p>
  368. <p style="text-align:justify;">వ్యక్తిగా బారక్ ఒబామా దగ్గర గాని, రాజకీయ పార్టీగా డెమొక్రటిక్ పార్టీ దగ్గర గాని ఆ డబ్బులు ఉన్నాయా లేవా, వారి ప్రకటిత ఆదర్శాలేమిటి, వారి శరీరపు రంగు ఏమిటి, వారు ఎక్కడ పుట్టారు అనేవన్నీ ఈ డాలరోక్రసీ కింద అణగిపోతాయి. అధికారిక ప్రకటనల ప్రకారం మొన్నటి ఎన్నికల ప్రచార వ్యయం కోసం ఒబామా 934 మిలియన్ డాలర్లు సేకరించి 852 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టగా, ప్రత్యర్థి మిట్ రోమ్నీ 881 మిలియన్ డాలర్లు సేకరించి 752 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాడు. అంటే రూపాయల్లో చెప్పాలంటే ఒబామా సేకరించినది రు. 5,200 కోట్లు. ఇందులో అత్యధిక భాగం బహుళజాతి సంస్థల నుంచి అందిన విరాళాలే. ఇంకా విశాలమైన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు అలా ఉంచినా, ఈ విరాళాలకైనా ప్రతిఫలం ఇవ్వాలి గదా.</p>
  369. ]]></content:encoded>
  370. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2012/12/20/%e0%b0%92%e0%b0%ac%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b1%81/feed/</wfw:commentRss>
  371. <slash:comments>0</slash:comments>
  372. <georss:point>0.000000 0.000000</georss:point>
  373. <geo:lat>0.000000</geo:lat>
  374. <geo:long>0.000000</geo:long>
  375. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  376. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  377. </media:content>
  378. </item>
  379. <item>
  380. <title>On Telangana March</title>
  381. <link>https://kadalitaraga.wordpress.com/2012/12/13/on-telangana-march/</link>
  382. <comments>https://kadalitaraga.wordpress.com/2012/12/13/on-telangana-march/#respond</comments>
  383. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  384. <pubDate>Thu, 13 Dec 2012 01:35:13 +0000</pubDate>
  385. <category><![CDATA[Videos]]></category>
  386. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=821</guid>
  387.  
  388. <description><![CDATA[&#160;]]></description>
  389. <content:encoded><![CDATA[<p><iframe class="youtube-player" width="640" height="360" src="https://www.youtube.com/embed/MRKBu0RJo-k?version=3&#038;rel=1&#038;showsearch=0&#038;showinfo=1&#038;iv_load_policy=1&#038;fs=1&#038;hl=en&#038;autohide=2&#038;wmode=transparent" allowfullscreen="true" style="border:0;" sandbox="allow-scripts allow-same-origin allow-popups allow-presentation allow-popups-to-escape-sandbox"></iframe></p>
  390. <p>&nbsp;</p>
  391. <p><iframe class="youtube-player" width="640" height="360" src="https://www.youtube.com/embed/4wyGpFudAto?version=3&#038;rel=1&#038;showsearch=0&#038;showinfo=1&#038;iv_load_policy=1&#038;fs=1&#038;hl=en&#038;autohide=2&#038;wmode=transparent" allowfullscreen="true" style="border:0;" sandbox="allow-scripts allow-same-origin allow-popups allow-presentation allow-popups-to-escape-sandbox"></iframe></p>
  392. ]]></content:encoded>
  393. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2012/12/13/on-telangana-march/feed/</wfw:commentRss>
  394. <slash:comments>0</slash:comments>
  395. <georss:point>0.000000 0.000000</georss:point>
  396. <geo:lat>0.000000</geo:lat>
  397. <geo:long>0.000000</geo:long>
  398. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  399. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  400. </media:content>
  401. </item>
  402. <item>
  403. <title>నేరం – శిక్ష – బాల్ ఠాక్రే &#8211; అజ్మల్ కసబ్</title>
  404. <link>https://kadalitaraga.wordpress.com/2012/12/13/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87/</link>
  405. <comments>https://kadalitaraga.wordpress.com/2012/12/13/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87/#respond</comments>
  406. <dc:creator><![CDATA[ఎన్.వేణుగోపాల్ N Venugopal]]></dc:creator>
  407. <pubDate>Wed, 12 Dec 2012 23:25:05 +0000</pubDate>
  408. <category><![CDATA[వ్యాసాలు]]></category>
  409. <category><![CDATA[Veekshanam]]></category>
  410. <guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=819</guid>
  411.  
  412. <description><![CDATA[వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే &#8230; <a href="https://kadalitaraga.wordpress.com/2012/12/13/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a>]]></description>
  413. <content:encoded><![CDATA[<p style="text-align:justify;"><span style="text-decoration:underline;">వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం</span></p>
  414. <p style="text-align:justify;">ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే పాకిస్తాన్ పౌరుడు. రెండు సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2010 మేలో కసబ్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ శిక్షను రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు కూడ నిర్ధారించాయి. చివరి అవకాశంగా పెట్టుకున్నక్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి నవంబర్ 5న నిరాకరించారు. ఆ తర్వాత నవంబర్ 21 ఉదయం కసబ్ ను ఎరవాడ జైలులో ఉరితీశారు.<span id="more-819"></span> ఈ చట్టబద్ధ హత్యకు దేశంలో చాలమంది ఆనందోత్సాహాలతో స్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రచార, ప్రసార సాధనాలన్నీ మితిమీరిన దేశభక్తితో ఉరి వార్తను, ఉరి తర్వాత దాన్ని సమర్థించే చర్చలను చేపట్టాయి.</p>
  415. <p style="text-align:justify;">ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ “ప్రతీకారానికి” సంతోషం వ్యక్తం చేసి ఉంటే, వారిలోని వ్యక్తిగత ప్రతీకారవాంఛను అర్థం చేసుకోవచ్చు గాని, ముంబై తోనూ, ఆ ఘటనలతోనూ ఏ సంబంధమూ లేనివారు కూడ సంతోషపడ్డారని వార్తలు వచ్చాయి. అంటే వాళ్లు కసబ్ చేసినది ఒక నేరంగా గుర్తించి, దానికి శిక్ష పడినందుకు సంతోషిస్తున్నారనుకోవాలి. మరి కసబ్ చేసిన నేరాల కన్న ఘోరమైన నేరాలు చేసిన, కసబ్ చంపినవారి కన్న ఎక్కువ మందిని చంపిన, చంపించిన మరొక వ్యక్తి అదే ముంబైలో సరిగ్గా రెండు రోజుల ముందు చనిపోయినప్పుడు ఎవరూ సంతోషించినట్టు వార్తలు రాలేదు సరిగదా, రాష్ట్రపతి నుంచి సాధారణ ముంబైకర్ దాకా చాల మంది విచారం, సంతాపం ప్రకటించారు. ముంబై జైలు నుంచి ఎరవాడ జైలుకు మార్చి కసబ్ ను ఉరి తీయడానికి మూడు రోజుల ముందు అదే ముంబైలో చనిపోయిన వ్యక్తి పేరు బాలా సాహెబ్ ఠాక్రే. ఆయన గుండెపోటుతో మరణిస్తే ముంబైలో నిర్బంధంగా బంద్ జరిపారు. కసబ్ మూడు రోజులపాటు ఒక నేరం చేసి, 164 మందిని చంపాడేమో గాని, బాల్ ఠాక్రే అటువంటి నేరాలే నలభై సంవత్సరాలకు పైగా చేస్తూ వేలాది మంది హత్యలకు దారితీసిన రాజకీయాలు నడిపాడు. ద్వేషభావం రెచ్చగొట్టాడు. మరి ఒకరి నేరానికేమో ఉరిశిక్ష అమలు జరగగా, మరొకరి నేరానికేమో శిక్ష లేకపోవడం మాత్రమే కాదు, విచారణ కూడ జరగలేదు.</p>
  416. <p style="text-align:justify;">అంటే ఈ దేశంలో నేరాలన్నీ ఒకటి కావన్నమాట. అన్ని నేరాలకూ శిక్షలు పడవన్నమాట. నేరాలు చేసిన వారందరూ చట్టం ముందర సమానం కాదన్నమాట. చేసిన మనిషి ఎవరనేదాన్నిబట్టి ఆ నేరం శిక్షార్హమైన నేరంగానో, విచారణాతీత నేరంగానో మారిపోతుందన్నమాట. ఇద్దరూ మనుషులను చంపినవాళ్లే అయినప్పటికీ ప్రచార సాధనాలు ఒకరి గురించి ముష్కరుడు, కరడుగట్టిన ఉగ్రవాది, ఖతం లాంటి మాటలు వాడాయి. మరొకరి గురించి ఉద్యమ ప్రయాణం ముగించిన నేత, ఇకలేరు, శోక సంద్రం, స్తంభించిన ముంబై లాంటి మాటలు వాడాయి. అంటే నేరం, శిక్ష విషయాల్లో అందరికీ సమానంగా వర్తించే తటస్థ ప్రమాణాలు లేవన్నమాట.</p>
  417. <p style="text-align:justify;">మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఫరీద్ కోట్ గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు. తండ్రి తోపుడు బండి మీద రొట్టెలు అమ్ముకుంటూ తిరిగి జీవనం గడిపేవాడు. అటువంటి కటిక దారిద్ర్యంలో మగ్గుతూ, పెద్దగా చదువుకోని కసబ్ ఏదో ఒక ఉపాధి కోసం వెతుకుతూ, లష్కర్ ఎ తయెబాలో చేరి, ఫిదాయీగా మారడం ఒక ఉద్యోగంగానే చేశాడని అన్ని కథనాలూ చెపుతున్నాయి. మత భావాలతో ప్రేరేపితుడై, తాను చేయబోతున్నది మహాకార్యమని, దానికి ప్రతిఫలంగా స్వర్గంలో భగవంతుని పక్కన స్థానం దొరుకుతుందని హామీ దొరికి ముంబై మారణకాండకు పాల్పడ్డాడు. అది కసబ్ కు ప్రత్యేకం కాదు, ఇస్లాంకూ ప్రత్యేకం కాదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఏ మతంలోని వ్యక్తి అయినా అటువంటి ఉద్యోగానికి సిద్ధపడవచ్చు. భారత్ లోనైనా, పాకిస్తాన్ లోనైనా మనుషుల్ని చంపే, నేరాలు చేసే వృత్తిని ఉద్యోగంగా ఎంచుకోక తప్పని ఆర్థిక దుస్థితిలో యువత ఉన్నందుకు వ్యవస్థలు తల వంచుకోవాలి. పండుగకు కొత్త బట్టలు కుట్టించమని అడిగితే తండ్రి కాదన్నాడని కసబ్ పద్దెనిమిదో ఏట ఇంటి నుంచి పారిపోయాడు. రెండేళ్ల పాటు చిన్న చితకా దొంగతనాలతో పొట్టపోసుకుని, 2007లో లష్కర్ ఎ తయెబా ప్రభావంలోకి వచ్చి, ఆయుధ శిక్షణ పొందాడు, ఇరవై ఒకటో ఏట 2008 నవంబర్ 23న మరొక తొమ్మిది మందితో కలిసి కరాచీలో బయల్దేరి, సముద్రం మధ్యలో భారతీయ చేపలపడవలోకి మారి ముంబైకి అతి సులభంగా చేరగలిగాడు.</p>
  418. <p style="text-align:justify;">వీపున సంచీతో, చంకలో ఎకె 47తో ఛత్రపతి శివాజీ టర్మినస్ లో ప్లాట్ ఫారంపై నడుస్తున్న కసబ్ అక్కడి సిసిటివి కెమెరాలకు చిక్కాడు. అక్కడా, మెట్రో సినిమా దగ్గరా కాల్పులు జరిపి, చౌపాటీ వైపు వెళ్తుండగా జరిగిన కాల్పులలో గాయపడి పోలీసులకు దొరికాడు. కాల్పులు, పేలుళ్లు జరిగిన అన్ని ప్రాంతాలలోనూ నేరస్తులు కాల్పులలో హతులైపోగా, మొత్తం నేరస్తుల బృందంలో సజీవంగా పోలీసుల చేత చిక్కినది కసబ్ మాత్రమే. పదకొండు వేల పేజీలకు మించిన ఛార్జి షీట్ లో ప్రాసిక్యూషన్ కసబ్ మీద ఎనభై నేరారోపణలు చేసింది. అసలు తనకు ఈ ఘటనలతో ఏ ప్రమేయమూ లేదని, ఉద్యోగం కోసం వెతుకులాటలో ముంబై వచ్చానని, ఈ ఘటనలు జరగడానికి మూడు రోజుల ముందే తనను పోలీసులు అనుమానాస్పదం తిరుగుతున్నాడని అరెస్టు చేశారని కసబ్ మొదట చెప్పాడు. తాను పాకిస్తాన్ పౌరుడినని, లష్కర్ ఎ తయెబా శిక్షణ ఇచ్చి ఈ విధ్వంసకాండ కోసం పంపించిందని మరొకసారి చెప్పాడు. కసబ్ ఒప్పుకోలు ప్రకటన అంటూ పోలీసులు ప్రకటించినది కనీసం మూడు సార్లు మారింది. కసబ్ తరఫు న్యాయవాదుల మీద హిందుత్వ శక్తులు చేసిన దాడులవల్ల ప్రభుత్వం మొక్కుబడిగా అందించిన న్యాయసహాయం తప్ప సమర్థమైన న్యాయసహాయం అందలేదు. ఎంతో మంది అమాయకులు మరణించి, విధ్వంసం జరిగిన నేపథ్యంలో న్యాయ విచారణ కూడ భావోద్వేగాలతో జరిగింది గాని, నిష్పక్షపాతంగా, సత్యాన్వేషణ దృష్టితో జరగలేదు. ఈ నేర విచారణ కోసమే ఏర్పాటయిన ప్రత్యేక న్యాయస్థానం చివరికి 2010 మే 6న కసబ్ కు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ముంబై హైకోర్టు, సుప్రీం కోర్టు కూడ ధృవీకరించాయి. మరణశిక్ష పడిన నేరస్తులు చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అభ్యర్థన పెట్టుకునే అవకాశం ఉంది. కసబ్ ఆ అభ్యర్థన కూడ చేయగా, ప్రతిభా పాటిల్ తన పదవీకాలంలో ఆ అభ్యర్థనను తిరస్కరించకుండా, ఆమోదించకుండా అలా ఉంచారు. రాష్ట్రపతిగా జూలై 25న పదవి స్వీకరించిన ప్రణబ్ ముఖర్జీ వందరోజులు గడవకుండానే నవంబర్ 5న ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మరణశిక్ష అమలయిపోయింది.</p>
  419. <p style="text-align:justify;">నిజానికి కసబ్ విచారణకు, ముంబై విధ్వంసకాండ విచారణకు సంబంధించి కీలకమైన ప్రశ్నలెన్నో మిగిలే ఉన్నాయి. అంత సులభంగా ఆగంతుకులు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించగల అవకాశం ఎలా వచ్చింది? తీర రక్షణ దళం, నావికాదళం, వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాధారణ పోలీసులు వంటి వందలాది, బహుశా వేలాది భద్రతా సిబ్బంది, ఈ పది మంది ఆగంతుకులు పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి భారత సరిహద్దుల్లోకి వచ్చి, ముంబై తీరంలో ప్రవేశిస్తుండగా ఏం చేస్తున్నారు? భారత భద్రతా బలగాల ఈ తప్పును ఎవరూ వేలెత్తి చూపలేదు. ముంబై నగరంలో అత్యున్నత భద్రత ఉండే ప్రాంగణాలలోకి సాయుధ ఆగంతుకులు ఎలా ప్రవేశించగలిగారని విచారణే జరగలేదు. ఇంతగా విదేశీ శక్తుల, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న నేరాన్ని సరిగా విచారించాలంటే ఆ నేరస్తులను సజీవంగా పట్టుకుని వివరాలన్నీ సంపాదించాలని భద్రతా బలగాలు అనుకోలేదు. పైగా ఒక్క సాక్ష్యమూ మిగలకుండా నేరస్తులందరినీ అక్కడికక్కడ చంపివేయడం వెనుక మరేదన్నా కుట్ర ఉందా విచారణ జరగలేదు. నేరస్తులకు ముంబైలో ఆశ్రయాలు, వాహనాలు, నిధులు సమకూర్చినవారెవరో విచారణ జరగలేదు. వారు కాల్పులకు ముందు పోలీసు వాహనాలలోనే ప్రయాణించారని ఆధారాలున్నప్పటికీ, వారు భయపెట్టి ఆ వాహనాలు చేజిక్కించుకున్నారనే కల్లబొల్లి వాదనలు తప్ప, నిజంగా ఆ వాహనాలు వారి చేతికి ఎలా చిక్కాయన్న విచారణ జరగలేదు. ఆ దాడులలో సూటిగా కాల్పులకు గురయి మరణించిన పోలీసు అధికారి హేమంత్ కర్కారే అంతకుముందు హిందుత్వవాదులను ఎదిరించిన చరిత్రగలవాడని, ఆయన మీద హిందుత్వవాదులే ఎక్కుపెట్టి ఉండవచ్చునని వచ్చిన ఆరోపణలకు నమ్మదగిన జవాబు లేదు.</p>
  420. <p style="text-align:justify;">కనుక మొత్తం మీద చూస్తే కసబ్ నేరస్తుడని ఒప్పుకున్నా మిగిలిపోయే ప్రశ్నలున్నాయి. నేరస్తుడు కాకపోవచ్చునని, పోలీసులు బనాయించే సాధారణ తప్పుడు కేసులలో ఇదీ ఒకటి కావచ్చుననే అనుమానాలూ ఉన్నాయి. ఇంత అనుమానాస్పదమైన పునాది మీద ఒక మనిషి ప్రాణాలను చట్టబద్ధంగా తీయడం జరిగిపోయింది. అది కూడ అసాధారణమైన తొందరపాటుతో, రహస్యంగా జరిగిపోయింది.</p>
  421. <p style="text-align:justify;">ఇక ఈ మరణశిక్ష అమలు చేసిన సందర్భం చూస్తే ప్రభుత్వం శిక్ష అమలు జరపడం కన్న, చట్టబద్ధ నిబంధనలు పాటించడం కన్న తన స్వప్రయోజనాలు ముఖ్యమని భావించిందని అర్థమవుతుంది. ముంబై దాడులు జరిగి నాలుగు సంవత్సరాలు నిండడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ప్రతీకాత్మకంగా ఈ శిక్ష అమలు జరిగింది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి మీద వివాదాస్పదమైన పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ ఉరిశిక్ష అమలయింది. మరొక మూడు వారాల్లో జరగనున్న గుజరాత్ ఎన్నికలలో ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి, మోడీ కన్న తామే ఎక్కువగా ముస్లిం వ్యతిరేకులమని, హిందూ ప్రజల సంరక్షకులమని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఈ ఉరిశిక్షను అమలు చేసింది. మరణశిక్షను రద్దు చేయాలనే తీర్మానానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి మాట్లాడిన రోజునే ఈ మరణశిక్ష అమలయింది.</p>
  422. <p style="text-align:justify;">కసబ్ మరణశిక్ష అమలు కాగానే హిందుత్వ శక్తులు ‘ఇక అఫ్జల్ గురును ఉరితీయాలి’ అనే ప్రచారం ప్రారంభించారు. స్వయంగా మోడీ తన ట్విట్టర్ సందేశంలో ఈ మాట రాశాడు. అఫ్జల్ గురు పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు. ఉరిశిక్ష 2004లో విధించబడినా, ఇంకా అమలు కాలేదు. కాని అఫ్జల్ గురు పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. “ఈ నిందితుడు నేరం చేశాడని నమ్మదగిన సాక్ష్యాధారాలేమీ లేనప్పటికీ, నేరస్తుడికి మరణశిక్ష విధిస్తేనే, సమాజపు సామూహిక అంతరాత్మ సంతృప్తి చెందుతుంది” అని నిస్సిగ్గుగా, నేరం చేసినట్టు రుజువు చేయకపోయినా ప్రతీకార వాంఛను సంతృప్తి పరచడం కోసం ఉరిశిక్ష విధించామని స్వయంగా సుప్రీంకోర్టు తీర్పులోనే రాశారు.</p>
  423. <p style="text-align:justify;">మరొకవైపు నుంచి చూస్తే, సరిగ్గా కసబ్ చేసినలాంటి నేరాలే భారత ప్రభుత్వం తరఫున పాకిస్తాన్ లో చేసిన సరబ్ జిత్ సింగ్ ఉన్నాడు. లాహోర్ లోనూ, ఫైసలాబాద్ లోనూ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్ జిత్ నేరస్తుడని, సరిగ్గా భారత న్యాయస్థానాలు కసబ్ విషయంలో విచారణ జరిపి తేల్చినట్టే, పాకిస్తాన్ న్యాయస్థానాలు నిర్ధారించి 1991లోనే మరణశిక్ష విధించాయి. ఆ మరణశిక్ష ఇంకా అమలు చేయలేదు. సరబ్ జిత్ కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం ఇన్నాళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వంతో రాయబారాలు నడుపుతున్నది. మరి లాహోర్, ఫైసలాబాద్ పేలుళ్లు, మారణకాండ శాంతియుతమైనవీ, ముంబై పేలుళ్లు, మారణకాండ మాత్రం నేరాలూ ఎలా అవుతాయి?</p>
  424. <p style="text-align:justify;">సమాజంలో శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని, ఆ శాంతి భద్రతలను భంగపరచడం నేరమని, ఆ నేరం చేసిన వారికి శిక్ష విధించాలని, ఆ శిక్ష ఇకముందు నేరం చేయదలచినవారికి బెదురుగా నిలుస్తుందని, నేరం – శిక్ష ప్రక్రియ సమాజాన్ని శాంతిభద్రతలతో ఉంచుతుందని చాల మంది నమ్ముతారు. ప్రతి నేరానికీ శిక్ష ఉండాలనేది సాధారణంగా అంగీకరించదగిన విలువే. కాని నేరం అంటే ఏమిటి అని నిర్వచించబూనుకుంటే, సమాజంలో నేరాలుగా వేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానాలను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహారం కాదని తేలిపోతుంది. ఒక వ్యక్తో, ఒక సమాజమో ఏదయినా చర్యను నేరం అనుకున్నంత మాత్రాన అది నేరం కాదు, చట్టంలో క్రోడీకరించబడినది మాత్రమే నేరం అవుతుంది. మరి చట్టాలను తయారుచేసే అధికారం ఉన్నవారు తమ ఇష్టారాజ్యంగా నేరాలను నిర్వచిస్తే, వాటికి శిక్షలను విధిస్తే అంగీకరించవలసిందేనా? అందుకే నేరం – శిక్ష ప్రక్రియ చాల సంక్లిష్టమైనది. అనేక చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో కలగలిసినది.</p>
  425. <p style="text-align:justify;">అసలు ఒక నేరానికి విధించే శిక్ష సమాజంలో ఆ నేరాలు మళ్లీ జరగకుండా శిక్షణ ఇవ్వగలిగిన, మానసిక పరివర్తన తేదగిన సామర్థ్యం కలిగినదై ఉండాలి. అసలు సమాజంలో ఏ మూలకారణాలవల్ల ఆ నేరం జరగడానికి అవకాశం వస్తున్నదో ఆ మూలకారణాలను తొలగించగలిగినదీ, తగ్గించగలిగినదీ అయి ఉండాలి. కాని ప్రస్తుత శిక్షలేవీ అంత విశాలమైన సంస్కరణ దృష్టిగానీ, రాజకీయార్థిక దృష్టిగానీ కలిగినవి కావు. తమ పాలన సజావుగా సాగడం కోసం బ్రిటిష్ వలసవాదులు రాసిపెట్టిన చట్టాలను యథాతథంగా అమలుచేస్తున్న భారత పాలకులు నేరం – శిక్ష ప్రక్రియ గురించి అంత నిశితమైన వైఖరి తీసుకుంటారని ఆశించలేం.</p>
  426. <p style="text-align:justify;">కాని మామూలు మధ్యతరగతి వ్యాఖ్యాతలు శిక్షలను, ముఖ్యంగా మరణశిక్షను సమర్థించేటప్పుడు, ఇకముందు అటువంటి నేరం జరగకుండా బెదురు కలిగించేలా శిక్ష ఉండాలని వాదిస్తారు. సమాజంలో ఎంత తీవ్రమైన శిక్షలు అమలవుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ పదే పదే అవే నేరాలు జరుగుతూ ఉండడమే ఈ వాదన డొల్లవాదన అని చెప్పడానికి ఉదాహరణ. నిజంగానే శిక్షలు బెదురుగా పనిచేస్తే ఇన్ని నేరాలు జరుగుతూనే ఉండేవి కావు. నిజానికి ఈ వాదన చేసేవారికి నేరాలు ఎందుకు జరుగుతాయో తెలియదు. అసలు నేరం అంటే ఏమిటి, పాలకవర్గాలు, చట్టాలు నిర్వచించినదే నేరమా వంటి తాత్విక ప్రశ్నలను కాసేపు పక్కన పెట్టినా, నేరాలు జరగడానికి మూడు రకాల కారణాలు ఉంటాయి: తమ చుట్టూ ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల ఒత్తిడివల్ల జరిగేవి మొదటి రకం. అటువంటి ఒత్తిడి వల్ల నేరాలు జరుగుతాయి గనుక ఆ నేరాలను ఏవో బెదురులు చూపి ఆపడం సాధ్యం కాదు. రెండో రకం నేరాలు క్షణికావేశానికి గురయి చేసేవి. ఆ నేరాలు స్వభావం వల్లనే మనుషులు ఉద్దేశపూర్వకంగా, ఆలోచించి చేసేవి కావు. అప్పటికప్పుడు భావోద్వేగం తోసుకువస్తే చేసేవి. ఆ భావోద్వేగంలో తాను చేసేది నేరమని, దానికి శిక్ష ఉంటుందని బెదిరే సమయం గాని, ఆలోచన గాని ఉండే అవకాశం లేదు. ఇక మూడో రకం నేరాలు పథకం ప్రకారం, ఉద్దేశ పూర్వకంగా, నేరానికి సంపూర్ణ ప్రణాళిక రచించుకుని, వ్యూహం పన్ని చేసే నేరాలు. ఈ నేరస్తులకు చట్టం అనేది ఉందని, తాము చేసే నేరానికి ఫలానా ఫలానా శిక్షలు ఉన్నాయని సంపూర్ణంగా తెలుసు. వారికి ఆ శిక్షల బెదురే ఉండదు. అంటే ఎలా చూసినా శిక్ష అనేది నేరస్తులకు బెదురుగా పనిచేస్తుందని, అందువల్ల మరణశిక్ష లాంటి పెద్దశిక్షలు ఉండవలసిందేనని చేసే వాదనలకు అర్థం లేదు. అవి ఎప్పటికీ తాము అనుకున్న ఫలితాన్ని కూడ సాధించలేవు.</p>
  427. <p style="text-align:justify;">మరి మరణశిక్షకు, లేదా ఇటువంటి పెద్ద శిక్షలకు సమర్థన ఎక్కడినుంచి వస్తున్నది? ఇవి కేవలం ప్రతీకారవాంఛ నుంచి పుట్టినవి. అవతలివాళ్లు మనకు నష్టం, బాధ కలగజేశారు కాబట్టి, వాళ్లకు మనం అంతే సమానమైన నష్టాన్ని, బాధను కలగజేయాలి అని బహుశా ప్రతివ్యక్తీ అనుకుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఉండే ఈ ప్రతీకారవాంఛ వల్లనే కసబ్ ఉరితీత జరగగానే ముంబై మారణకాండ బాధిత కుటుంబాలు సంతోషించాయి. కాని కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఈ ఆదిమ, మధ్యయుగాల ప్రతీకార న్యాయం నాగరికమైనది కాదని కొన్ని శతాబ్దాలుగా మానవజాతి ఆలోచిస్తున్నది. వ్యక్తి తన పట్ల  జరిగిన నేరానికి ప్రతీకారం తీసుకోవాలనే కోరికతో కంటికి కన్ను, పంటికి పన్ను కోరుతాడని, అందువల్ల ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని బాధిత వ్యక్తికి ఇవ్వగూడదని, సమాజంలోని భిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం కుదిర్చే రాజ్యమే ఆ ప్రతీకార బాధ్యతను వహిస్తుందని, ఆ ప్రతీకారాన్ని నాగరిక పద్ధతుల్లో సాధిస్తుందని ఆధునిక చట్టబద్ధ పాలనా భావన చెపుతుంది. అందుకే మిగిలిన నేరాలన్నీ వ్యక్తిగత స్థాయిలో ఉన్నా, హత్యా నేరాలలో మాత్రం బాధితుల తరఫున ప్రభుత్వమే వాదిస్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుంది అని గాంధీ అన్న మాట మరణశిక్షను దృష్టిలో పెట్టుకున్నదే.</p>
  428. <p style="text-align:justify;">ఈ ప్రతీకారం గురించి, నేరానికి తగిన శిక్ష ఉండడం గురించి వాదించే మధ్యతరగతి అన్ని నేరాల గురించీ ఇలాగే ఆలోచిస్తుందా అని చూస్తే దాని వాదనల దివాళాకోరుతనం మరింత బయటపడుతుంది. అణగారినవర్గాలు, అధికారంలో లేని వర్గాలు, నిస్సహాయ వ్యక్తులు, బృందాలు చేసే “నేరాల”కు కఠిన శిక్షలు విధించాలని, మరణశిక్ష తప్పనిసరిగా ఉండాలనీ వాదించేవారు, ఆధిపత్య వర్గపు నేరాల విషయంలో, పాలకవర్గ విధానాలే నేరాలుగా మారే సందర్భాలలో తమ నేర నిర్వచనాన్ని మార్చేసుకుంటారు. ఆస్తి, అగ్రవర్ణం, మెజారిటీ మతం, పురుషాధిపత్యం, పెద్ద వయసు, అభివృద్ధి చెందిన ప్రాంతం వంటి అవకాశాలు ఉన్నవారు చేసే నేరాలు నేరాలుగా కనబడవు. వాటికి శిక్షలు విధించాలని ఎవరూ గొంతెత్తి పలకరు. ఇక అధికారాన్ని చేపట్టిన పాలకవర్గ విధానాల పర్యవసానాలను నేరాలుగా గుర్తించడం, వాటికి శిక్షలు పడాలని కోరడం అసాధ్యమే అవుతుంది.</p>
  429. <p style="text-align:justify;">కసబ్ కొన్ని మరణాలకు, 164 మందో, 167 మందో మరణించడానికి ప్రత్యక్ష బాధ్యుడు గనుక ఉరి తీయవలసిందే అని వాదించేవారు అటువంటి మరణాలకే కారణమవుతున్న ఇతర నేరస్తుల గురించి పట్టించుకుంటారా? ఉత్పత్తి సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకుని, అశేష పీడిత ప్రజానీకాన్ని ఆకలికీ, చీకటికీ, అనారోగ్యానికీ, అవిద్యకూ, నిరుద్యోగానికీ గురిచేస్తున్న, అందువల్ల కోట్లాది మంది మరణాలకు కారణమవుతున్న నేరస్తులను ఎలా శిక్షించాలి? తోటి మానవుల పట్ల కుల వివక్ష చూపుతూ కోట్లాది మందిని అవమానానికీ, నిరాదరణకూ, దారిద్ర్యానికీ గురిచేస్తున్న అగ్రవర్ణాల నేరాలు ఎక్కడయినా నమోదవుతున్నాయా, వాటికి శిక్షలు పడుతున్నాయా? స్త్రీని అసమానంగా చూసి, భ్రూణ హత్యల నుంచి వరకట్నపు చావుల దాకా తక్షణ హత్యలకూ, బతికి ఉండనిచ్చినా దుర్మార్గమైన అసమానతకూ వివక్షకూ, దీర్ఘకాలిక హత్యలకూ గురిచేస్తున్న పితృస్వామిక, పురుషాధిపత్య అహంకారాన్ని నేరంగా గుర్తిస్తారా? ఆ నేరానికి శిక్ష విధిస్తారా?</p>
  430. <p style="text-align:justify;">పోనీ, అవన్నీ సామాజిక వ్యవస్థలో, భావజాలంలో భాగమైన, అలవాటైన స్వభావాలని అనుకున్నా, మన కళ్ల ముందర, మూడువేల మందిని ఊచకోతకోసిన నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని, రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు కంటూ, ఆయన చేసిన, చేయించిన హత్యలలో ఇరవయ్యో వంతు కూడ చేయని కసబ్ ను మాత్రం ఉరితీయవలసిందే అని వీరాలాపాలకు దిగడం సవ్యమేనా? లక్షన్నరమంది రైతుల ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా కారణమైన నూతన ఆర్థిక విధానాలను ఈ దేశంలోకి తెచ్చిన మన్మోహన్ సింగ్ ను ఆ హత్యలు చేసినందుకే ఆర్థిక మంత్రినుంచి ప్రధాన మంత్రిగా పదోన్నతి ఇచ్చి, పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించి, నూట అరవై మందిన హత్య చేసిన వాడిని మాత్రం ఉరితీయవలసిందే అని అడగడం భావ్యమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని ఒక విధాన ప్రకటన చేసి, దాన్ని ఉపసంహరించుకుని, నిరాశా నిస్పృహలను వ్యాపింపజేసి వెయ్యి మందిని ఆశోపహతులను చేసి హత్య చేసిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండగా, నూట అరవై మందిని చంపినవాడు మాత్రం ఉరికంబం ఎక్కవలసిందేనా? కనీసం లెక్కల ప్రకారం చూసినా పెద్ద నేరస్తులను వదిలిపెట్టి, చిన్న నేరస్తులను బలి తీసుకోవడం న్యాయమా?</p>
  431. <p style="text-align:justify;">అవన్నీ కూడ పోనీండి, కసబ్ ఉరితో ఓలలాడేవాళ్లు అంతకు మూడు రోజుల ముందు మరణించిన బాల్ ఠాక్రే గురించి అయినా ఆలోచించవద్దా? ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన శివసేన అనే మతోన్మాద పార్టీని, సామ్నా అనే పత్రికను నడిపేవారు. ఆయన రాసిన ఏ వ్యాసం చదివినా, ఆయన ఉపన్యాసాలు విన్నా ఆయనను మించిన తీవ్రవాది ఎవరూ ఉండరని తేలిపోతుంది. ఆ రచనలు, ఉపన్యాసాలు అలా ఉంచి, 1960ల చివరినుంచి చనిపోవడానికి కొద్ది ముందుదాకా బొంబాయి లోనూ, మహారాష్ట్ర లోనూ మరాఠీలు కానివారందరి మీద, ప్రత్యేకించి ముస్లింల మీద విపరీతమైన ద్వేషభావనను రెచ్చగొట్టిన హిందుత్వ తీవ్రవాది ఆయన. 1966లో దసరా ఊరేగింపులో భాగంగా బొంబాయిలోని దక్షిణ భారత హోటళ్ల మీద, దుకాణాల మీద దాడులతో ప్రారంభించి, 1969లో అరవై మంది కన్నడిగులను హత్య చేసిన, వందలాది మందిన గాయపరచిన భాషా కల్లోలాలు రెచ్చగొట్టాడు. సిపిఐ శాసనసభ్యుడు కృష్ణ దేశాయి, దళిత్ పాంథర్ కవి భగవతీదళ్ జాదవ్ లతో సహా వందలాది మంది భిన్నస్వరాలను హతమార్చిన ఘన చరిత్ర ఆయనది. దళితుల మీద, దక్షిణాది వారి మీద, సిక్కుల మీద, ముస్లింల మీద, తాజాగా బిహారీల మీద ఆయన నేతృత్వంలోని శివసేన సాగించిన దాడుల పూర్తి జాబితా పేజీలకు పేజీలు అవుతుంది.    1993లో వెయ్యి మంది మరణించిన ముంబై అల్లర్లకు ప్రధాన కారణం ఆయన రచనలేనని, శివసైనికులకు ఆయన చేసిన ఉద్బోధలేనని బి ఎన్ శ్రీకృష్ణ న్యాయవిచారణ కమిషన్ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. 1997లో రమాబాయి అంబేద్కర్ నగర్ హత్యాకాండలో ఆయన శివసైనికులు ఒక్కరోజు పది మంది దళితులను హత్య చేశారు. మొత్తం మీద ముంబైలో, విదర్భలో బహుశా వేలాది మందిని ఊచకోత కోసిన ఘటనలకు రూపశిల్పి. వ్యూహకర్త బాల్ ఠాక్రే. మరి మన కళ్లముందరి ఈ హంతక సామ్రాజ్య చక్రవర్తికి సంతాప, శోక సందేశాలేమిటి? అటువంటి హంతక సామ్రాజ్యంలో చక్రవర్తో, సామంతుడో కూడ కాదు, పొట్టకూటికి చేరిన ఉద్యోగధర్మంగా, లేదా తలకెక్కిన మతోన్మాదపు హింసాకాండగా అటువంటి హత్యలే కొన్ని చేసిన ఒక చదరంగపు పావును చంపేసి, చంపినందుకు ఆనందించి, ఇంకా చంపాలని రెచ్చగొడుతూ&#8230;.ఎటు పోతున్నాం మనం?</p>
  432. <p style="text-align:justify;">ఈ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేరం &#8211; శిక్ష ప్రక్రియ గురించి, ముఖ్యంగా మరణ శిక్ష గురించి, అధికారవర్గపు మారణకాండల నేరాల గురించి, వారికి వేయవలసిన శిక్షల గురించి కాస్త ఆలోచించవలసి ఉంది.</p>
  433. <p style="text-align:justify;">
  434. ]]></content:encoded>
  435. <wfw:commentRss>https://kadalitaraga.wordpress.com/2012/12/13/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87/feed/</wfw:commentRss>
  436. <slash:comments>0</slash:comments>
  437. <georss:point>0.000000 0.000000</georss:point>
  438. <geo:lat>0.000000</geo:lat>
  439. <geo:long>0.000000</geo:long>
  440. <media:content url="https://0.gravatar.com/avatar/94abe2015ddf643a1df6a449a9d35b740e56c4cabe19f97b83b7ce13ad1e78dd?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
  441. <media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
  442. </media:content>
  443. </item>
  444. </channel>
  445. </rss>
  446.  

If you would like to create a banner that links to this page (i.e. this validation result), do the following:

  1. Download the "valid RSS" banner.

  2. Upload the image to your own server. (This step is important. Please do not link directly to the image on this server.)

  3. Add this HTML to your page (change the image src attribute if necessary):

If you would like to create a text link instead, here is the URL you can use:

http://www.feedvalidator.org/check.cgi?url=https%3A//kadalitaraga.wordpress.com/feed/

Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda